అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ,కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అస్సాంలో వరుసగా రెండోసారి సిఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా హిమంత నిలిచారు. ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులు ప్రమాణం చేశారు. అస్సాంలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. 126 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయేకు 102 మంది సభ్యుల బలముంది. బీజేపీ ఒక్కటే 82 సీట్లు గెల్చుకోగా, దాని కూటమి భాగస్వాములైన ఎజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు దక్కించుకున్నాయి. దీంతో ఎన్డీయే రాష్ట్రంలో వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.