హైదరాబాద్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకూడదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సిఎం వీడియోకాన్ఫరెన్స్ జరిపారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చూడాలని, లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని రేవంత్ సూచించారు. అధికారులు కొనుగోళ్ల తీరును పరిశీలించాలని, గన్నీబ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. రైతులకు వాతావరణ సూచనలు చేరవేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.