
గల్ఫ్ యుద్ధం తిరిగి రగులుకుంది. శుక్రవారం ఇరాన్ గల్ఫ్దేశం అరబ్ ఎమిరేట్ప్సై డ్రోన్లుచ క్షిపణులతో దాడికి దిగింది. దీనితో కొంతకాలంగా అమలులో ఉన్న కాల్పుల విరమణకు గండిపడే పరిస్థితి ఏర్పడింది. తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టామని యుఎఇ శుక్రవారం ప్రకటించింది. మరో వైపు హర్మూజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడులను నివారించామని అమెరికా తెలిపింది. అంతేకాకుండా ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా యుఎస్ సైనిక వర్గాలు నిర్థారించాయి. యుఎఇలో ఇరాన్ దాడులలో ఏ మేరకు నష్టం జరిగిందనేది వెల్లడికాలేదుహర్మూజ్లోని క్వెషెమ్ దీవులలో తాము శత్రుదేశ బలగాలతో తలపడ్డామని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ద్వారా ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే వివరాలను వెల్లడించలేదు.
















