
టివికెకు సిపిఐ మద్దతు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే కీలక పాత్ర పోషించారు. ఆయన శుక్రవారం అర్జంటుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో ఫోన్లో మాట్లాడారు. తమిళనాడులో విజయ్ పార్టీ టివికె ఏర్పాటు కావాలంటే సిపిఐ మద్దతు కూడా అవసరం అని లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఏదో సాకుతో అక్కడ కొత్త ప్రభుత్వ స్థాపనలో జాప్యం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బిజెపికి అవకాశం ఇవ్వకుండా చేయాల్సి ఉందని తెలిపారు. తరువాత రాజా తాము ఆలోచించి చెపుతామని పేర్కొన్నారు. డిఎంకె సహా ఇతర పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుందని రాజా ఖర్గేకు చెప్పారు . తరువాత ఈ క్రమంలోనే టివికెకు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం అయింది.















