
రాయ్పూర్: ఎంబిఎ విద్యార్థినిపై దుకాణాదారుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం భుబానేశ్వర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ యువతి ఎంబిఎ చదువుకుంటూ ఓ రూమ్ తన అద్దెకు తీసుకొని ఉంటుంది. రూమ్లో స్నేహితురాలితో కలిసి ఉంటుంది. 67 ఏళ్ల వృద్ధుడు కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడు సరుకులను డోల్ డెలవరీ కూడా చేస్తున్నారు. ఎంబిఎ విద్యార్థిని అవసరాల నిమిత్తం నిత్యావసరాలు బుక్ చేసుకుంది. 67 ఏళ్ల వృద్ధుడు వస్తువు తీసుకొని యువతి రూమ్కు చేరుకొని డోర్ తట్టాడు. వెంటనే ఆమె వస్తువు తీసుకుంది. అంతకు ముందే వృద్ధుడు యువతికి తెలియడంతో మంచి నీళ్లు అడిగాడు. రూమ్లో ఎవరు లేరని గమనించి వెంటనే డోర్ లోక్ చేసి యువతిపై అత్యాచారం చేశాడు. వెంటనే యువతి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.












