
భువనేశ్వర్: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారా వెటర్నరీ కాలేజీ మైదానంలో బిశ్వశర్మతో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమ బెంగాల్ సిఎం సువేందు అధికారి, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత రికార్డు సృష్టించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 126 అసెంబ్లీ స్థానాలలో బిజెపి 82 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జులుక్బారి నియోజకవర్గం నుంచి హిమంత శర్మ 89 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.














