హైదరాబాద్: హ్యామ్ రోడ్ల స్కామ్ ను అసెంబ్లీలో బయటపెట్టామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. టెండర్లు తెరిచారని..సగటున 25 శాతం ఎక్సెస్ వెళ్లాయని, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో టెండర్లు ఎక్సెస్ వెళ్లాయని తెలియజేశారు. ఆర్ అండ్ బి కంటే పిఆర్ లో రెండు శాతం ఎక్కువ ఉందని, ఒక టెండర్ ఏకంగా 75 శాతం ఎక్సెస్ వేశారని అన్నారు. ఆర్ అండ్ బి లో రూ.11 వేల కోట్లతో టెండర్ పిలిస్తే రూ. 15 వేల కోట్లు అవుతుందని, పిఆర్ లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు రూ. 8 వేల కోట్లు అవుతుందని అన్నారు. రెండు శాఖలో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ. 5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, హైవేలకు టెండర్లు పిలిస్తే 25 శాతం తక్కువ.. హ్యామ్ రోడ్లలో 25 శాతం ఎక్కువ అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.