హైదరాబాద్: మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. ఐఎండిబి అనే సంస్థ పాపులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో నటుడు, దర్శకుడు అంబరీష్ వర్మ ఉండగా రెండో స్థానంలో విజయ్, ఏడో స్థానంలో హీరోయిన్ సాయి పల్లవి ఉన్నారు. వారం రోజుల క్రితం విజయ్ 21వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అంబరీష్ దర్శకత్వం వహించిన సప్నే వర్సెస్ ఏవ్రీవన్ సీజన్: 2 సిరీస్ అమెజాన్ ఫ్రైమ్ లో అందుబాటులో రావడంతో ఆయనన తొలి స్థానం దక్కించుకున్నాడు. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించడంతో పాటు సిఎం కావడంతో ఆయన రెండో స్థానంలో ఉన్నాడు. ఏక్ దిన్ అనే సినిమాలో జునైద్ తో కలిసి నటించడంతో సాయి పల్లివి ఏడో స్థానానికి చేరుకుంది.