
అమరావతి: ఫోన్ చూస్తు ఆటో డ్రైవర్ భవనం పైనుంచి పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎనికేపాడులోని శివాలయంలో వీధిలో నాగరాజు(25) అనే ఆటో డ్రైవర్ నివసిస్తున్నాడు. మూడో తేదీ రాత్రి భవనం పిట్టగోడపై కూర్చొని నాగరాజు ఫోన్ చూస్తున్నాడు. తల్లి నాగమణి భవనం పైకి వెళ్లి కుమారుడిని కిందకు రమ్మని చెప్పింది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో నాగరాజు పైనుంచి కిందపడిపోవడంతో పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.















