ఐపిఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని అందుకుంది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడా గెలుపొందింది. బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన టైటాన్స్.. అతిధ్య జట్టును మట్టికరిపించింది. 230 పరుగుల భారీ లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్‌ను రషీద్ ఖాన్(4/33), కగిసో రబాడ(2/33), జాసన్ హోల్డర్(2/11)లు బాల్ చెలరేగడంతో 152 పరుగులకే చాపచుట్టేసింది రాజస్థాన్. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగడంతో రాజస్తాన్ రాయల్స్‌కు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిబ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థ సెంచరీలతో కధంతొక్కగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్), రాహుల్ తెవాటియా (14 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. దీంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ దక్కించుకున్నారు.