
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నేరాలు, ఘోరాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రోజుకు 6 మంది పిల్లలు మిస్సింగ్, కిడ్నాప్ లలో 70శాతం బాలికలేనని అన్నారు. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు దిగజారాయని, హ్యూమన్ ట్రాఫికింగ్లోనూ తెలంగాణ టాప్ అని మహిళలపై నేరాలు 24,495 కి పెరిగాయని క్రైమ్ రేట్ జాతీయ సగటు కంటే ఎక్కువ అని తెలియజేశారు. కమాండ్ కంట్రోల్ లో కూర్చుని రేవంత్ ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పబ్లిసిటీ తప్ప పాలన లేదని, రేవంత్ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న నేరాలకు హోంమంత్రి, రేవంత్ బాధ్యత వహించాలని హరీష్ రావు సూచించారు.














