సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శిని’. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి”అని అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ “అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓ పెద్దాయన బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరియే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమిని సురేష్, గీతికాదాస్, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.