హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టుంచుకోవద్దని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టి ఇంధన నిల్వ చేయడం నేరమని హెచ్చరించారు.