నవతెలంగాణ-మల్హర్ రావు.ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పది వార్షిక పరీక్ష ఫలితాల్లో భాగంగా మండలంలోని వల్లెంకుంట గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బొమ్మ రజిత,ఉప సర్పంచ్ కటకం స్వప్న,డేమక్రేటివ్ టీచర్ పెడరేషన్ జిల్లా కార్యదర్శి తిరుపతి,అధ్యాపకబృందం గురువారం డిక్షినరీలు అందజేసి,శాలువాలతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు కష్టపడి పై చదువుల్లో కూడా మెరిట్ను కనబరిచి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి,సమాజానికి మార్గదర్శకులుగా నిలబడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

The post విద్యార్థులకు డిక్షినరీలు అందజేత appeared first on Navatelangana.