🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5115 articles

పెట్రోల్-డీజిల్ ధరలపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు
Older
Telangana

పెట్రోల్-డీజిల్ ధరలపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ కొనసాగితే, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావచ్చని మల్హోత్రా అన్నారు. మంగళవారం స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో మల్హోత్రా అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు […] The post పెట్రోల్-డీజిల్ ధరలపై ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు appeared first on Navatelangana.

Admin1 day ago👁 1
అమెరికాలో ఎపి యువతి మృతి
Older
అడుగంటుతున్న కృష్ణమ్మ
Older
సినిమాలు బాలేవు.. జనాలు రావట్లేదు.. టాలీవుడ్ మేకర్స్‌పై  రాహుల్ రామకృష్ణ ఫైర్!
Older
రుచి కోసం పుచ్చకాయపై ఉప్పు వేసుకొని తింటున్నారా..?
Older
Telangana

రుచి కోసం పుచ్చకాయపై ఉప్పు వేసుకొని తింటున్నారా..?

వేసవి వచ్చిందంటే చాలు చాలామంది పుచ్చకాయను తినడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాదు, ఈ పండు చల్లదనాన్ని, శరీరానికి తేమను అందిస్తుంది. దీనిలో సుమారు 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి, వేసవిలో ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవచ్చు. చాలామంది పుచ్చకాయను అనేక విధాలుగా తింటుంటారు. కొందరు దీనిని ఉప్పుతో తినడానికి ఇష్టపడతారు. మరికొందరు దీనిని ఉప్పుతో తినాలా వద్దా అని సందేహిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం..పుచ్చకాయను ఉప్పుతో అస్సలు తినకూడదు. పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో తింటున్నట్లయితే ఆ అలవాటును వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఏ పండులోనైనా ఉప్పు కలపడం దాని పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను దూరం చేస్తుంది. ఇదే విషయం పుచ్చకాయకు కూడా వర్తిస్తుంది. పుచ్చకాయను వెంటనే కోసి, ఉప్పు లేకుండా తినాలి. దీనివల్ల శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 1. పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా పుచ్చకాయ తినడ

రైతులను చంపాలని డిసైడ్ అయ్యారా?..పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్
Older
కాటారం ఆర్డీవోగా డి. రవీందర్
Older
Telangana

కాటారం ఆర్డీవోగా డి. రవీందర్

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవోనవతెలంగాణ-కాటారం కాటారం ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన డి. రవీందర్ బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్డీవో రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా మరియు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆర్డీవో […] The post కాటారం ఆర్డీవోగా డి. రవీందర్ appeared first on Navatelangana.

ఊపిరితిత్తులులో ఫంగస్ కు ఆపరేషన్
Older
Telangana

ఊపిరితిత్తులులో ఫంగస్ కు ఆపరేషన్

కర్నూలు: ఆస్పర్జిల్లోసిస్ అనే ఫంగస్ రియల్ గా అయితే ఇలా ఉంటుంది.. ఎక్స్ రేలో కనపడిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ లాగే ప్రమాదకరమైనది. ఇది నిదానం గా పెరిగి ఆ ఊపిరితిత్తులు లో క్యావిటీనంత ఆక్రమించుకొని దగ్గు కలుగజేసి రక్తం హీమాప్టైసిస్ ద్వారా ప్రాణాలను తీస్తుంది. ఈరోజు 70 ఏళ్ల పేషెంట్ కు ఆపరేషన్ చేశాము. ఈ సర్జరీకి 5 గంటల సమయం పట్టింది. అతి క్లిష్టమైన ఊపిరితిత్తులు ఆపరేషన్ కుడివైపు అప్పర్ లోబెక్టమి చేశాము. పేషెంట్ బాగున్నాడు కాకపోతే మాకే నడుములు మెడ నొప్పులు వచ్చాయి. పేషెంట్ బాగయితే అంతా మరిచిపోతాము.ఇటువంటి ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో రెండు వందలకు పైగా చేసి ఉంటాను. మూడు నుంచి ఐదు లక్షల పైన ఖరీదైన ఈ ఆపరేషన్ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ టిఆర్ వైద్యసేవ కింద ఉచితంగా చేయబడుతుంది. దీనికి ప్యాకేజీ చాలా తక్కువగా ఉండడం వలన బయట ఆసుపత్రులలో చేయరు. ఇంకో సంవత్సరం మాత్రమే నాకు సర్వీస్ ఉంది. తర్వాత రిటైర్ అయిపోతాను కావున ఎవరైనా అవసరం ఉంటే తొందరగా చూపించుకోగలరు.డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

కొల్లూరు పోలీస్ SI సురేష్  సస్పెండ్ : మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి పేరుతో మోసం
Older
వేసవిలో ఎండుద్రాక్ష, సోంపు నీరు తాగితే ఏమవుతుంది?
Older
Telangana

వేసవిలో ఎండుద్రాక్ష, సోంపు నీరు తాగితే ఏమవుతుంది?

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మండే ఎండ, తీవ్రమైన వేడి శరీరం నుండి తేమను పూర్తిగా హరించివేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, డీహైడ్రేషన్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఎండుద్రాక్ష, సోంపు నీరు తాగాలని సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలో ఇనుము, సహజ చక్కెర, పీచుపదార్థం, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అంతేకాదు, రక్తహీనతను తొలగించి బలహీనతను తగ్గిస్తుంది. ఇక సోంపులో కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ రెండింటినీ రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగినప్పుడు, అది శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇప్పుడు ఎండుద్రాక్ష, సోంపు నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరుస్తుంది: సోంపు చల్లదనాన్నిచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, దాని నీరు వేసవి

ప్రధాని మోదీ పొదుపు మంత్రం : రెండు సెక్యూరిటీ కార్లతోనే కాన్వాయ్
Older
Ram Charan: ‘పెద్ది’ డబుల్ ధమాకా రెడీ.. 18న ముంబైలో ట్రైలర్.. స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Older
గచ్చిబౌలిలో లిఫ్ట్ లో ఇరుక్కొని బాలిక మృతి
Older
Telangana

గచ్చిబౌలిలో లిఫ్ట్ లో ఇరుక్కొని బాలిక మృతి

హైదరాబాద్: లేడీస్ హాస్టల్ లో లిఫ్ట్ లో ఇరుక్కొని ఐదేళ బాలిక మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గౌలిదొడ్డిలోని ఓ లేడీస్ హాస్టల్ పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కుటుంబం వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. గ్రిల్ లిఫ్ట్ లో బాలిక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఐదో ఫ్లోర్ వెళ్లింది. మూడో ఫ్లోర్ లో చిన్నారి జుట్టు ఇరుక్కుపోవడంతో తల మొత్తం నుజ్జు నుజ్జుగా మారి చనిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్య సిబ్బంది తెలిపారు. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్..
Older
Telangana

తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్..

నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా చాలా మంది తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే బైక్‌లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. రోడ్లు తరచుగా అధ్వాన్నంగా, ఎగుడుదిగుడుగా ఉండే గ్రామీణ వినియోగదారులకు ఈ అవసరం మరింత కీలకంగా మారింది. అందువల్ల దృఢమైన బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన మైలేజీనిచ్చే బైక్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో రోజువారీ ఉపయోగం కోసం మార్కెట్లో అనేక బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్లు 100cc లేదా 110cc ఇంజన్‌లతో వస్తాయి. ఈ ఇంజన్లు తక్కువ పెట్రోల్‌ను వినియోగించి, ఎక్కువ కాలం పాటు నమ్మకమైన పనితీరును అందిస్తాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ దాని బలమైన ఇంధన సామర్థ్యం, శక్తివంతమైన ఇంజన్‌కు ప్రసిద్ధి చెందింది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.76,000 నుండి ప్రారంభం కాగా, ఆన్-రోడ్ ధర సుమారుగా రూ.90,000 వరకు ఉంటుంది. హోండా షైన్ రెండవ స్థానంలో హోండా షైన్ నిలిచింది. దూర ప్రయాణాల కోసం ఈ బైక్ సౌకర్యవంతంగా ఉంటు

విడాకుల రూమర్స్‌పై నోరు విప్పిన మౌనీ రాయ్.. భర్త ఫోటోలు ఎందుకు డిలీట్ చేసిందంటే?
Older
ప్రయాణికులకు షాక్: పెరిగిన ఖర్చులతో సర్వీసులు నడపలేం.. ఆ రూట్లలో Air India విమానాలు రద్దు
Older
కువైట్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ ఇరాన్
Older
Telangana

కువైట్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ ఇరాన్

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐఆర్‌జీసీ(Islamic Revolutionary Guard Corps)కి చెందిన ప‌లువురు సముద్ర తీరంలోని బిబియన్ ద్వీపం గుండా త‌మ భూభాగంలోకి చొర‌బ‌డి, అల‌జ‌డుల‌కు కుట్ర‌లు చేశార‌ని, న‌లుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు కువైట్ పేర్కొంది. ఈ వ్యాఖ్య‌ల‌ను ఇరాన్ ప్ర‌భుత్వం ఖండించింది. కువైట్ మాట‌లు అవాస్త‌వమ‌ని, ఆధారాలులేనివ‌ని ఇరాన్ మీడియా త‌న్సీయం పేర్కొంది. కువైట్ అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తుంద‌ని, పొరుగు దేశాల సార్వ‌భౌమాత్వాన్ని ఇరాన్ ఎల్ల‌ప్పుడు గౌర‌విస్తోంద‌ని ఇరాన్ విదేశాంగ తెలిపింది . ఇక‌పై కువైట్ అధికారులు “తొందరపాటు వ్యాఖ్యలు, […] The post కువైట్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ ఇరాన్ appeared first on Navatelangana.

గచ్చిబౌలిలో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి
Older
ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం
Older
Telangana

ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం

నవతెలంగాణ-ఆలేరు టౌనునల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నార్మల్ డైరీని గట్టేక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మొదటి విడతగా రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రం వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల […] The post ఎంఎల్ఏ బీర్ల ఐలయ్యకు గజమాలతో సన్మానం appeared first on Navatelangana.

మహబూబ్ నగర్ లో పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా: ఒకరు మృతి
Older
రూ. 30వేల లోపు బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్లు.. ఏది కొంటారో మీ ఇష్టం!
Older
Telangana

రూ. 30వేల లోపు బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్లు.. ఏది కొంటారో మీ ఇష్టం!

మీరు రూ. 30 వేల బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! ఈ రేంజ్ లో ఆమోలెడ్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన బ్యాటరీలతో కూడిన మూడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏవి? వాటి ధర ఎంతో చూద్దాం. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6వన్‌ప్లస్ నుండి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 వివో టి5 ప్రో 5జి ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో 6.83-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 9020mAh బ్యాటరీ ఉన్నాయి. భారత టెక్ మార్కెట్లో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. రెడ్‌మి నోట్ 15 5G 5520mAh బ్యాటరీతో వచ్చే ఈ పరికరం 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.24,999 ధరతో లభిస్తుంది. ఈ రెడ్‌మి

కూకట్ పల్లిలో ప్రేమపేరుతో మహిళా కానిస్టేబుల్ ను మోసం చేసిన ఎస్ఐ
Older
Telangana

కూకట్ పల్లిలో ప్రేమపేరుతో మహిళా కానిస్టేబుల్ ను మోసం చేసిన ఎస్ఐ

కూకట్ పల్లి: మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ ప్రేమపేరుతో మోసం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేశారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సీ సురేష్ కుమార్ ఎస్సె గా పని చేస్తున్నారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ తో పరిచయం కావడంతో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ కానిస్టేబుల్ ను ఎస్ఐ శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో ఏవో సాకులు చెబుతూ తప్పించుకున్నాడు. ఈ మధ్య పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఎస్సై సురేష్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెపై సురేష్ ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని సురేష్ తేల్చి చెప్పాడు. దీంతో అతనిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే స

కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు
Older
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ దిగువ ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలి
Older
Advertisement
Sponsored by ATA – American Telugu Association