5503 articles

నవతెలంగాణ – హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, సింగిరెడ్డిపల్లికి చెందిన దళిత యువకుడు జూల వంశీ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని మండలం, గడిడల గాంధీ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30 నుంచి కనిపించకుండా పోయిన వంశీ, హైదరాబాద్లో ఒక యువతిని కలవడానికి వెళ్లినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ యువతి భర్త ఆమెను హైదరాబాద్కు పిలిపించి, పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పూర్తి […] The post దళిత యువకుడి దారుణ హత్య appeared first on Navatelangana.

హైదరాబాద్: దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరైనా జెండా లేకపోవడంతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకనవుతోందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి డిఎంకెతో కాంగ్రెస్ మంచి సంబంధాలు ఉన్నాయని, డిఎంకె పార్టీతో పొత్తుతోనే అనేక సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడిందన్నారు. స్టాలిన్ పార్టీని వదిలి కాంగ్రెస్ టివికెతో చేతులు కలిపిందని విమర్శలు గుప్పించారు. అధికారంపై దురాశతో స్టాలిన్కు వెన్నుపోటు పొడించిందని, రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంత దారుణానికైన ఒడిగడుతుందని విమర్శలు గుప్పించారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరాటాలతో సుపరిపాలన అందించడం లేదని, గత మూడు సంవత్సరాల నుంచి కర్నాటక ప్రజలు సమస్యలు పరిష్కరించకుండానే అంతర్గత కలహాలను పరిష్కరించుకుంటున్నారని చురకలంటించారు. కర్నాటక ముఖ్యమంత్రి ఎంత కాలంలో కొనసాగుతారో చెప్పలేకపోతున్నారన్నారు. కర్నాటకలో సరైన పాలన లేకపోవడంతో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బిజెపి ఘన విజయం సాధించిందని, భవిష్యత్లో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశ

బెంగళూరు: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆధ్యాత్మిక, సేవాభావం ముందు వరుసలో ఉంటాయని అన్నారు. బెంగుళూరు లో మోడీ పర్యటించారు. ఆర్ట్ ఆప్ లివింగ్ 45వ వార్షికోత్సవం లో మోడీ పాల్లొన్నారు. కొత్తగా నిర్మించిన ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరులో మోడీ మీడియాతో మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ మానవతావాద సంస్థని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ ప్రతిబింభిస్తుందని, దేశంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలియజేశారు. సమాజశక్తి కలిస్తేనే ఎలాంటి పథకాలైనా విజయవంతం అవుతాయని, అన్ని పనుల్లో సేవ ప్రధానమైనదని మోడీ పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని జయించాలని, ధ్యానం, ప్రాణాయామంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని సూచించారు. ఒత్తిడి, హింస లేని సమాజ నిర్మాణానికి ఆర్ట్ ఆఫ్ లింగ్ విశేష కృషి చేసిందని, అన్నారు. సమాజం బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని, సమాజ శ్రేయస్సుకు సేవ, ప్రేమ వంటి సాధనాలు ఉపకరిస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇదొక ప్రభుత్వ కార్యక్రమం కాదని అందరూ కలిసి చేయాల్సిందని, ఇతరులకు సేవ చేయడం వంటి విషయాలకు ఆర్ట్ ఆఫ్ లివి
నవతెలంగాణ-హైదరాబాద్: కొత్త సీఎం విజయ్కు సచివాలయం ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా చైన్నైలోని సీఎం కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సంద్భరంగా సెక్రటరీ ఉద్యోగులంతా సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చాంబర్కు వెళ్లారు. ఆదివారం ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను […] The post కొత్త సీఎంకు సచివాలయ ఉద్యోగుల ఘన స్వాగతం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : 17వ తమిళనాడు శాసనసభ సమావేశాలు రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. తాత్కాలిక స్పీకర్ సమక్షంలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి కొత్త స్పీకర్ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోనుంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతోంది. The post రేపే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు.. appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధిచింది. ఈ మ్యాచ్లో విజయానికి కారణం కెప్టెన్ శుభ్మాన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్లే అని బ్యాటింగ్ కోచ్ మాథ్యూ అన్నారు. ‘‘300 స్ట్రైక్రేట్తో 30 పరుగులు చేయడం ఉత్తేజకరంగా అనిపించినా.. 220 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధిస్తుంటే నిలకడగా.. సుదీర్ఘ సమయం క్రీజులో ఉండటం అవసరం. మా వద్ద ఉన్న టాప్-3 ఆటగాళ్లు 150 స్ట్రైక్రేట్తో నిలకడగా ఆడగలరు. వాస్తవానికి అలా బ్యాటింగ్ చేయడం కష్టం. కానీ, మా వాళ్లు సుదీర్ఘ కాలంగా నిలకడగా ఆడుతున్నారు. వాళ్ల, ఫిట్నెస్, టెస్టులు, వన్డేలు ఆడిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతోందని’’ హేడెన్ పేర్కొన్నారు.
ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూల్యమైనది. మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు… మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్నీ, చిత్రవిచిత్ర ప్రదేశాల్ని సృష్టించి పెట్టింది. జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్లి రావాల్సిందే. అలాంటి… అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. తియాంజీ పర్వతాలుకొన్ని కొన్ని ప్రదేశాల్ని చూస్తే… అద్భుతాన్ని తలపిస్తాయి. ఈ తియాంజీ పర్వతాలు అలాంటివే. అక్కడకు ఒక్కసారి వెళ్లినా చాలు… ఈ జీవితానికి ఇక […] The post వారెవ్వా appeared first on Navatelangana.
డయాబెటీస్ మెల్లిటస్ (డీఎం), తెలుగులో మధుమేహం అనే ఈ జబ్బుకు శరీరంలోని సర్వాంగాలను రుగ్మతకు గురిచేసే సామర్థ్యముంది. ఇతర ఏ జబ్బులకీ లేనంతటి, శరీరమంతటా ఆవహించ గలిగి, ప్రాణాంతక సంభావ్యశక్తి గలిగిన ఏకైక జబ్బు డీఎం. శరీరంలోని ఏ అవయం కూడా దీని ప్రభావాల నుండి తప్పించుకోలేదు. అన్నీ కూడా రక్తనాళాలలో దీర్ఘకాలంగా ప్రవాహిస్తున్న అధిక గ్లూకోస్ స్థాయి (హైపర్ గ్లైసీమిక్) కలిగి ఉన్న రక్తం వలన సంభవించే సంక్లిష్టతలు. శరీరానికి ఇంధన సరఫరాకు మించిన గ్లూకోజ్ […] The post డయాబెటిస్పై ఎందుకింత ఫోకస్? appeared first on Navatelangana.

హైదరాబాద్: తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్నానని, తాను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలనన్నారు. తన కుమారుడిపై నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి దుయ్యబట్టారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని బండి విమర్శించారు. అట్టడుగు స్థాయి నుంచే తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టానని, కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో అప్పుడు కార్పొరేటర్ గా, నేడు ఎంపిగా ఎన్నిక కావడంతో పాటు ఇప్పుడు కేంద్రమంత్రి సేవలందిస్తున్నానని, తాను ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో తనని వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యమన్నారు. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. సమ
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అని పేర్కొన్నారు. The post సీఎం విజయ్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు appeared first on Navatelangana.

చెన్నై: తాను మన అందరివాణ్ణి అని తాను మన ఇంట్లో కుటుంబసభ్యుడునని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని, అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని హామి ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలియజేశారు. తనను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఏది సాధ్యమో అది మాత్రం చేస్తానని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తానని విజయ్ పేర్కొన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందని, తన ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని, టివికె కార్యకర్తలు లేకుంటే తాను లేనని అన్నారు. ఇది అస్థిర ప్రభుత్వం కాదని, తనకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు అని రాజకీయాల్లోకి వస్తే తాము చూసుకుంటామని ప్రజలంతా ప్రేమగా పిలిచారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కాపాడటం తమ ప్రభుత్వం లక్ష్యమని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, తాను దేవదూతను కాదని అన్నారు. అది చేస్తాం..ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పనని, ప్రజా ధనాన్ని వృధా చేయనని, దోచుకోనని, ప్రభుత్వంలో వేరే పవర్ సె
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి […] The post ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్ appeared first on Navatelangana.



నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్: ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 తరగతులు నిర్వహించాలని.. ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని […] The post తెలంగాణలో యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం జరిగిన ట్రేడింగ్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త జట్టులో సంజు మంచి ప్రదర్శనే చేస్తున్నాడు. ప్రస్తుతానికి 10 మ్యాచుల్లో 57.43 యావరేజ్తో 402 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే సంజు విషయంలో ఓ వార్త సోషల్మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే.. సంజుకి సిఎస్కె కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని పుకార్లు పుట్టుకొచ్చాయి. మరోవైపు ఐపిఎల్ వ్యాఖ్యాతలు చేసిన కొన్ని కామెంట్స్ ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు అయింది. మాజీ క్రికెటర్ ఆర్ అశ్విన్ కూడా సంజు కచ్చితంగా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలకు సంజు చెక్ పెట్టాడు. ఓ ప్రోమో వీడియోలో అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ ఈ ప్రచారానికి తెరదించాడు. తాను ఎటువంటి డిమాండ్లతో చెన్నై జట్టులో చేరలేదని తేల్చి చెప్పాడు. ‘‘కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో.. ఎటువంటి డిమాండ్లతో వెళ్ల కూడదని నేర్చుకొన్నాను’’ అని సంజు వెల్లడించాడు. కాగా, నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయి




