5502 articles

• ఇద్దరికి తీవ్ర గాయాలు• కొరిపల్లి శివారులో ఘటననవతెలంగాణ – పెద్దవంగరరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండలంలోని కొరిపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని శంకర్ తండా కు చెందిన జాటోత్ వెంకన్న తన భార్య జాటోత్ విజయ, చిన్నమ్మ జాటోత్ భద్రమ్మ (60) ముగ్గురు కలిసి, వడ్డెకొత్తపల్లి […] The post రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా పీఎం మోడీ హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్, సీఎం రేవంత్రెడ్డి తో పాటు పార్టీశ్రేణులు స్వాగతం పలికారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45గంటలకు సాయి సింధు క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి గుజరాత్లోని జామ్ […] The post హైదరాబాద్కు చేరుకున్న పీఎం మోడీ appeared first on Navatelangana.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి జోష్ మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్లో ఆర్సిబిని చిత్తు చేసిన ఎల్ఎస్జి ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా చెన్నై బరిలో దిగుతుండగా.. ఎల్ఎస్జి రెండు మార్పులు చేసింది. జోష్ ఇంగ్లిస్, ఆవేశ్ ఖాన్లను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: సిఎస్కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, జెమీ ఓవర్టన్, అకీల్ హొసేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేశ్ చౌదరీ. ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్రమ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జి.ఎస్.ఆర్.నవతెలంగాణ-శాయంపేటఅకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే ఆ ధాన్యాన్ని కొంటామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నేరేడుపల్లి ప్రగతి సింగారం కాట్రపల్లి వసంతపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 40 కిలోల 650 గ్రాములు మాత్రమే కాంటాలు పెట్టాలని తెలిపారు. తేమ 17 శాతం ఉండేటట్లు చూసుకోవాలని రైతులకు […] The post తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం appeared first on Navatelangana.
– ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణనవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ సెన్సార్లను ఉపయోగించి గ్రామంలోని విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినందున సర్పంచ్ పై గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లకు సెన్సార్లు లేకపోవడం వలన విద్యుత్తు వినియోగం పెరగడంతో బిల్లులు భారీగా వస్తూ గ్రామపంచాయతీకి భారంగా మారుతుంది. శాశ్వత పరిష్కారం చేసేందుకు గ్రామస్తులు, పంచాయతీ కార్యవర్గ సభ్యులతో సర్పంచ్ […] The post సెన్సార్ల పరికరంతో విద్యుత్ ఆదా appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నీటి సమస్యను గ్రామ సర్పంచ్ బుక్కావార్ ఆశ చందర్ పాటిల్ ఆదివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో నీటి సమస్య కొనసాగుతూ ఉండేదని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం బోరు మోటారు కాలిపోవడమే అని చెప్పారు. శాశ్వత పరిష్కారం కొరకు పరిష్కరించేందుకు గ్రామస్తుల సహకారంతో మోటారును రిపేరు చేయించామని తెలిపారు. దీంతో గ్రామస్థులకు ఇక మీదట నుంచి నీటి సమస్య శాశ్వతంగా […] The post మాదాపూర్ నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరాను గురుగ్రామ్ కోర్టు ఏడురోజుల ఈడీ కస్టడీకి పంపినట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మనీలాండరింగ్ కేసులో అరోరా అధికారిక నివాసం సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన అనంతరం శనివారం సాయంత్రం ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అరోరాను చండీగఢ్ నుండి రోడ్డు మార్గంలో గురుగ్రామ్కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈడీ పదిరోజుల రిమాండ్ కోరగా, గురుగ్రామ్ లోని పిఎంఎల్ ఎ ప్రత్యేక కోర్టు ఏడు […] The post సంజీవ్ అరోరాకు ఏడురోజుల ఈడీ కస్టడీ appeared first on Navatelangana.

హైదరాబాద్: ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవం జరుపుకుంటున్నారు. అందరు తమ తల్లికి విషెస్ చెబుతూ .. తల్లులతో సరదాగా గడుపుతున్నారు. అయితే మన మెగాస్టార్ చిరంజీవి కూడా మాతృదినోత్సవం సందర్భంగా ఎక్స్లో ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అమ్మ మనకు మొదటి గురువు, మొదటి ధైర్యం అని చిరు పేర్కొన్నారు. ‘‘కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…! మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని చిరు రాసుకొచ్చారు.
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ( Enforcement Directorate), సీబీఐలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పంజాబ్ మంత్రి హర్భజన్ సింగ్ ఆరోపించారు. మనీలాండరింగ్ నెపంతో మంత్రిని సంజయ్ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సహచర మంత్రి అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. “ఆపరేషన్ లోటస్” పేరుతో ప్రజలను భయపెట్టి BJPలో చేర్చుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరేలా ఒత్తిడి చేయడానికి కేంద్ర సంస్థలను మోడీ సర్కార్ వినియోగిస్తోందని, […] The post బీజేపీ పాలనలో ఈడీ, సీబీఐ దుర్వినియోగం: పంజాబ్ మంత్రి appeared first on Navatelangana.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావునవతెలంగాణ – ముధోల్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా లు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి ఆదివారం పర్యటించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్ […] The post పకడ్బందీగా బాసర మాస్టర్ ప్లాన్ అమలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టారు. ఈ మేరకు కరోలిన్ తన సామాజిక మాధ్యమ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పోస్టుపై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. మొదట కరోలిన్ లీవిట్కు శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో, మినాబ్ ఘటనను ప్రస్తావించింది. పిల్లలు అమాయకులని, వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదని తెలిపింది. కానీ మినాబ్లోని పాఠశాలలో మీ బాస్ హత్య […] The post వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ పోస్టుపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు appeared first on Navatelangana.

రంగారెడ్డి: ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో మీర్ పేట ప్రాంతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు... ఆదిత్య పాండే అనే వ్యక్తి కురుమలగూడ నివసిస్తూ వెహికల్ సీజింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేేస్తున్నాడు. ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆదిత్య పాండేను కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : వైభవ్ సూర్యవంశీ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 40 లోపు బంతుల్లోనే రెండు ఐపీఎల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ కూడా. శనివారం, సూర్యవంశీ మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, టీ20లలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ […] The post ‘సిక్సర్ల’ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ రికార్డ్ appeared first on Navatelangana.

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్కి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో విజయ్ పరిపాలన అద్భతుతంగా సాగాలని మోడీ ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని మోడీ అన్నారు. తమళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్కి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక సిఎం రేవంత్ రెడ్డి కూడా తమిళనాడు సిఎంగా విజయ్ రాష్ట్రాభివృద్ధిలో ఉన్న శిఖరాలకు చేరుతారని బలంగా నమ్ముతున్నా అని అన్నారు.




నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ లో పోలీస్ పోస్ట్, వాహనంపై జరిగిన వరుస కారు బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయని అన్నారు. ధ్వంసమైన పోలీస్ అవుట్ పోస్ట్ నుండి 12మంది అధికారుల మృతదేహాలను వెలికితీశామని, తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ఆస్ప్రతికి తరలించామని […] The post పోలీస్ వాహనంపై బాంబు దాడి..15మంది మృతి appeared first on Navatelangana.