5502 articles
నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవికుమార్ పటేల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుండూరు లో బీఆర్ఎస్ కార్యకర్త , పెద్ద ఏడ్గి గ్రామ కార్యకర్త, పడంపల్లి గ్రామ కార్యకర్త, హంగర్గా గ్రామ కార్యకర్త, చిన్నగుల్ల గ్రామ కార్యకర్త, వివాహ మహోత్సవం శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో శుభకార్యాలు నిర్వహిస్తున్న […] The post శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.

రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి నవతెలంగాణ-మిడ్జిల్ ప్రతిపక్ష నాయకులపై విమర్శలుమాని నియోజకవర్గం అభివృద్ధిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయడం చిగ్గుచేటని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆగ్రహం […] The post విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి appeared first on Navatelangana.


బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో కలకం రేగింది. ప్రధాని సభ జరిగే చోటు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. రెండు జెలిటెన్ స్టిక్స్ని పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ వాటిని అక్కడి నుంచి తరలించారు. వాటిని అక్కడ పెట్టినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాని మోడీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జెలిటన్ స్టిక్స్ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకె అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్కు సీపీఐ(ఎం) అభినందనలు తెలిపింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆదివారం ఎక్స్ వేదికగా సిఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం (టివికె) అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్ కు అభినందనలు. లౌకికవాదం, ప్రజా సంక్షేమం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం సూత్రాలను నెలబెట్టే, తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మీకు, […] The post సీఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన ఎంఎ. బేబి appeared first on Navatelangana.

అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ కింద పడి మహిళ మృతి చెందింది. వడ్లమూరు నుంచి కాకినాడ వెళ్లే బస్సులో మహిళ సామర్లకోటకు రాగా, రాజానగరం బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా.. బస్సు దిగుతుండగా కిందపడిపోయింది. మహిళ మృతదేహాన్ని పెద్దాపురం ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ ఔనవతెలంగాణ – వర్ధన్నపేటవర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శలు చేయడం అర్థ రహితమని, విమర్శించే స్థాయి వారికి లేదని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి పలువురు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆకేరు వాగు శాశ్వత నిర్మాణ పనుల శిలాఫలక […] The post మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్పై విమర్శలు అర్ధరహితం appeared first on Navatelangana.
కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకెళ్ళాంతాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆప్రైజర్ దొరక్కనే స్ట్రాంగ్ రూమ్లో గోల్డ్ లోన్స్ అలస్యమవుతుందని,ఈ విషయాన్ని కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకపోయినట్టుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. పిఏసిఎస్ లో స్ట్రాంగ్ రూమ్ నిరుపయోగంగా ఉంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. 2021లో […] The post ఆప్రైజర్ లేకనే గోల్డ్ లోన్స్ ఆలస్యం.! appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డినవతెలంగాణ-మునుగోడురైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతులకు అమ్ముకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తాలు తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాకులు […] The post తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.


హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి వర్చువల్గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్లోని పిఎం మిత్ర పార్కును ప్రారంభించారు. జహీరాబాద్లో పారిశ్రామిక ప్రాంతానికి, నాలుగు వరుసల రోడ్డు పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. గుడెబెల్లూర్-మహబూబ్నగర్ మధ్య 165 కి.మి. మేర హైవేకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని తెలిపారు. సైబరాబాద్.. అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఇవి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. వరంగల్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ టెక్స్టైల్ రంగంలో వరంగల్ ప
నవతెలంగాణ – అశ్వారావుపేటభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు బీఆర్ఎస్ సోషల్ మీడియా అశ్వారావుపేట యాక్టివిస్ట్ మోటూరు మోహన్ తో పాటు అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోటూరి మోహన్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14 న నిర్వహించనున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాసాని నాగ శేష పద్మ చంద్రమోహన్, […] The post కేటీఆర్ కు మోటూరి గృహప్రవేశ ఆహ్వానం appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని.. ఇది వికాస ఉత్సవం అని తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్ కలసి నడుస్తామని అన్నారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ప్రధాని మోడీని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాలువాతో సిఎం సత్కరించి, నంది జ్ఞాపికను అందించారు. హెచ్ఐసిసి వర్చువల్ గా రూ. 9, 377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పనిలేదని.. అభివృద్ధి గురించే మాట్లాడదామని అన్నారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడానికి మోడీ వచ్చారని రేవంత్ పేర్కొన్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకనామీని లక్ష్యంగా పెట్టుకుందని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకనామీ చేరుకోవడమే తమ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్ లా అభివృద్ధి చేయండి అని ఆరోజు ద

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో శ్రీ మల్లిఖార్జున స్వామి కళ్యాణంలో భువనేరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయాల అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో […] The post ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్స్ నారోకు విధించిన జైలు శిక్షను తగ్గించే చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ చేపట్టేవరకు, ఈ చట్టాన్ని నిలిపివేయాలని శనివారం జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్ ఆదేశించారు. 2022లో వామపక్ష అభ్యర్థి లూలా డ సిల్వా చేతిలో ఓడిపోయిన బోల్సెనారో పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ కేసులో […] The post బోల్సెనారో శిక్ష తగ్గింపు చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.


హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ శివప్రతావ్ శుక్లా, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రధాని హెచ్ఐసిసికి వెళ్లారు. రూ.9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నవతెలంగాణ-నాచారం నాచారం సర్కిల్ హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తికాగా, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాలనీలోని మంచినీటి పైపులైన్లు సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఉండటంతో పనుల అమలులో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొత్త మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీ రాఘవేంద్ర నగర్ […] The post రాఘవేంద్ర నగర్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు ఆటంకం appeared first on Navatelangana.
ప్రారంభం కాని ప్రూనింగ్ పనులునవతెలంగాణ – మల్హర్ రావుకాటారం సబ్ డివిజన్లో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన,గిరిజనేతర పేద కుటుంబాలకు వేసవి కాలంలో తునికాకు సేకరణ ద్వారా రెండో ఆదాయం లభిస్తోంది. వ్యవసాయ పనులు ముగియగానే తునికాకు సేకరణపై దృష్టిని సారించి వేసవి ఆదాయం సమకూర్చు కోవడం ఏజెన్సీలోని పేద ప్రజల జీవన విధానం. కాని తునికాకు సేకరణపై ఇంకా ఎలాంటి స్పష్టత రాక పోవడంతో అసలు తునికాకు సేకరణ ఉంటుందో? లేదో? తెలియని అయోమయం ఏజెన్సీ ప్రజల్లో […] The post తునికాకు సేకరణ జరిగేనా.? appeared first on Navatelangana.
ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావునవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ఈనెల 11 నుంచి 25 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థులు వేసవి సెలవులను సరదాగా,సుజనాత్మకంగా గడపడానికి ఈ క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.ఈ క్యాంపులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులు చేరవచ్చన్నారు. క్యాంపు ఈ నెల 11 నుంచి 25వ తేదీ […] The post మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్.! appeared first on Navatelangana.
పూర్తి మెజార్టీ ఉన్న టీవీకే పార్టీకి వెంటనే ఆహ్వానం ఇవ్వాలిఆయిల్ రెడ్డి నరసింహారెడ్డినవతెలంగాణ-కొండాపూర్ తమిళనాడులో పూర్తి మెజార్టీ సాధించిన టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ వెంటనే ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత ఆయిల్ రెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీవీకే పార్టీకి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు ఇతర పార్టీల మద్దతు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ […] The post తమిళనాడులో గవర్నర్ వైఖరి దురదృష్టకరం appeared first on Navatelangana.