5487 articles
ఘనంగా హనుమాన్ దీక్ష హోమ కార్యక్రమంనవతెలంగాణ – గీసుగొండగీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో పురాతన శ్రీ ఆది మహాలక్ష్మి సమేత శ్రీ పాంచాల రాయస్వామి దేవాలయంలో హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో మండల దీక్ష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వాములు కలిసి ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “సర్వేజనా సుఖినోభవంతు – లోకా సమస్తా సుఖినోభవంతు” అంటూ భక్తులు ఏకనామ సంకీర్తనలు చేస్తూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, […] The post శాయంపేట హవేలీలో భక్తి వైభవం appeared first on Navatelangana.

చెన్నై: టివికె చీఫ్ విజయ్ ఆదివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తిరుచ్చి ఈస్ట్.. పెరంబూర్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే తాజాగా పెరంజూర్ స్థానంలో ఎమ్మల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేయనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు. అయితే ఆ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే.. ఒక దానికి రాజీనామా చేయాలి. తమిళనాడులో అన్నాడిఎంకె అధినేత్రి దివంగత జయలలిత తర్వాత ఏకకాలంలో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన నేతగా విజయ్ గుర్తింపు పొందారు.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేశారు. పెరంబూర్ సీటును నిలుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. The post తిరుచ్చి ఈస్ట్ స్థానానికి సీఎం విజయ్ రాజీనామా appeared first on Navatelangana.



చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై.. లక్నోని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 33 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సులతో 85 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. చివర్లో షహబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 203 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్లో ఓవర్టన్ 3, అన్షుల్ 2. నూర్ 1 వికెట్ తీశారు.
నవతెలంగాణ-హైదరాబాద్: చెపాక్ వేదికగా లక్నో వారియర్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో..ఇంగ్లిస్ దూకుడుగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 85 పరుగులు చేసి భారీ స్కోర్కు బాటలు వేశాడు. అయితే ఇంగ్లిస్ ఔట్ తో ఒక్కసారిగా స్కోర్ నెమ్మదించింది. మార్కరమ్(06) రనౌట్ కాగా, పంత్(15), మార్ష(10), స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరాడు. పూరన్ […] The post లక్నో వారియర్స్ భారీ స్కోర్ appeared first on Navatelangana.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్నవతెలంగాణ-నెల్లికుదురుజిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యండి యాకూబ్ అన్నాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం మండల సంగం నాయకుడు బాణాల యాకయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కుటుంబాలు కూలి మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు అనేక మంది ఉన్నారని అన్నారు. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర […] The post జిల్లా మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవికుమార్ పటేల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుండూరు లో బీఆర్ఎస్ కార్యకర్త , పెద్ద ఏడ్గి గ్రామ కార్యకర్త, పడంపల్లి గ్రామ కార్యకర్త, హంగర్గా గ్రామ కార్యకర్త, చిన్నగుల్ల గ్రామ కార్యకర్త, వివాహ మహోత్సవం శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో శుభకార్యాలు నిర్వహిస్తున్న […] The post శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.

రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి నవతెలంగాణ-మిడ్జిల్ ప్రతిపక్ష నాయకులపై విమర్శలుమాని నియోజకవర్గం అభివృద్ధిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయడం చిగ్గుచేటని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆగ్రహం […] The post విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి appeared first on Navatelangana.


బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో కలకం రేగింది. ప్రధాని సభ జరిగే చోటు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. రెండు జెలిటెన్ స్టిక్స్ని పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ వాటిని అక్కడి నుంచి తరలించారు. వాటిని అక్కడ పెట్టినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాని మోడీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జెలిటన్ స్టిక్స్ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకె అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్కు సీపీఐ(ఎం) అభినందనలు తెలిపింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి ఆదివారం ఎక్స్ వేదికగా సిఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం (టివికె) అధ్యక్షుడు తిరు సి. జోసెఫ్ విజయ్ కు అభినందనలు. లౌకికవాదం, ప్రజా సంక్షేమం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం సూత్రాలను నెలబెట్టే, తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మీకు, […] The post సీఎం విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన ఎంఎ. బేబి appeared first on Navatelangana.

అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ కింద పడి మహిళ మృతి చెందింది. వడ్లమూరు నుంచి కాకినాడ వెళ్లే బస్సులో మహిళ సామర్లకోటకు రాగా, రాజానగరం బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా.. బస్సు దిగుతుండగా కిందపడిపోయింది. మహిళ మృతదేహాన్ని పెద్దాపురం ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎంపీ కడియం కావ్య వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ ఔనవతెలంగాణ – వర్ధన్నపేటవర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శలు చేయడం అర్థ రహితమని, విమర్శించే స్థాయి వారికి లేదని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వర్ధన్నపేట బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి పలువురు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆకేరు వాగు శాశ్వత నిర్మాణ పనుల శిలాఫలక […] The post మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్పై విమర్శలు అర్ధరహితం appeared first on Navatelangana.
కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకెళ్ళాంతాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్యనవతెలంగాణ – మల్హర్ రావుఆప్రైజర్ దొరక్కనే స్ట్రాంగ్ రూమ్లో గోల్డ్ లోన్స్ అలస్యమవుతుందని,ఈ విషయాన్ని కరీంనగర్ కెడిసి సిఓ దృష్టికి తీసుకపోయినట్టుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. పిఏసిఎస్ లో స్ట్రాంగ్ రూమ్ నిరుపయోగంగా ఉంటుందని ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. 2021లో […] The post ఆప్రైజర్ లేకనే గోల్డ్ లోన్స్ ఆలస్యం.! appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డినవతెలంగాణ-మునుగోడురైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతులకు అమ్ముకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తాలు తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాకులు […] The post తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.


హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి వర్చువల్గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్లోని పిఎం మిత్ర పార్కును ప్రారంభించారు. జహీరాబాద్లో పారిశ్రామిక ప్రాంతానికి, నాలుగు వరుసల రోడ్డు పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. గుడెబెల్లూర్-మహబూబ్నగర్ మధ్య 165 కి.మి. మేర హైవేకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని తెలిపారు. సైబరాబాద్.. అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఇవి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. వరంగల్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ టెక్స్టైల్ రంగంలో వరంగల్ ప
నవతెలంగాణ – అశ్వారావుపేటభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు బీఆర్ఎస్ సోషల్ మీడియా అశ్వారావుపేట యాక్టివిస్ట్ మోటూరు మోహన్ తో పాటు అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకులు ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోటూరి మోహన్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 14 న నిర్వహించనున్న గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాసాని నాగ శేష పద్మ చంద్రమోహన్, […] The post కేటీఆర్ కు మోటూరి గృహప్రవేశ ఆహ్వానం appeared first on Navatelangana.

హైదరాబాద్: ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని.. ఇది వికాస ఉత్సవం అని తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్ కలసి నడుస్తామని అన్నారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ప్రధాని మోడీని గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాలువాతో సిఎం సత్కరించి, నంది జ్ఞాపికను అందించారు. హెచ్ఐసిసి వర్చువల్ గా రూ. 9, 377 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఐసిసి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పనిలేదని.. అభివృద్ధి గురించే మాట్లాడదామని అన్నారు. 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామని, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడానికి మోడీ వచ్చారని రేవంత్ పేర్కొన్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకనామీని లక్ష్యంగా పెట్టుకుందని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకనామీ చేరుకోవడమే తమ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్ లా అభివృద్ధి చేయండి అని ఆరోజు ద