5472 articles

– ప్రారంభానికి సిద్దం నవతెలంగాణ – అశ్వారావుపేట పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం భవిత భవనాల అభివృద్ధి చేపట్టింది. ఆకర్షణీయంగా పునరుద్ధరణ చేసిన ఈ కార్యాలయాలను సోమవారం నుంచి చేపట్టిన విద్యా వారోత్సవాలు లో ప్రారంభం చేయనున్నారు. జిల్లా లో ఆరు మండలాల్లో పాత భవనాలకు మరమ్మతులు,మరో 17 మండలాలకు కొత్త భవనాల మంజూరు చేసారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న భవిత కార్యక్రమానికి మరింత […] The post ఆకర్షణీయంగా రూపొందిన భవిత కార్యాలయం appeared first on Navatelangana.
– ఉపాధ్యక్షులు గా అశ్వారావుపేట కళాకారుడు ముత్తూజా నవతెలంగాణ – అశ్వారావుపేటతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రల రఘు ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చీకటి కార్తీక్, వైయస్ ఆర్ రెడ్డి హాజరయ్యారు. […] The post కాంగ్రెస్ జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.
శాసన మండలి డిప్యూటీ చైర్మెన్, రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్నవతెలంగాణ – ధర్పల్లిమండల కేంద్రానికి చెందిన బొండ్ల నర్సయ్య ముదిరాజ్ కు కూతురు గత కొన్ని నెలల క్రితం హత్యకు గురైంది. దీంతో అనాదలైన ఇద్దరు పిల్లలకు (చిన్న పిల్లలు మణివర్దన్ , ఇమషు,) చదువుల భాద్యత తాను తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ హామీ ఇచ్చారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్లో ఆయన నివాసంలో కలిసిన బాధిత కుటుంబ సభ్యులకు […] The post పిల్లల చదువులకు అండగా ఉంటా appeared first on Navatelangana.


మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ పిసిసి చీఫ్ మహేందర్ కుమార్ గౌడ్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2కు వెంటనే కేంద్ర ఆమోదం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.38,595 కోట్ల మెట్రో విస్తరణ ప్రాజెక్టును జాయింట్ వెంచర్లో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సహాయం ఇవ్వాలని, మూసీ ప్రాజెక్టును జాతీయ స్థాయి అర్బన్ రివర్ రీస్టోరేషన్ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు. బాపూ ఘాట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ అప్రూ వల్ వెంటనే ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి కూడా కేంద్ర అనుమతులు మంజూరు చేయాలని కోరారు. రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును 100 శాతం కేంద్ర నిధులతో చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి చొరవ చూపాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం చొరవ
నవతెలంగాణ-హైదరాబాద్: ఖతార్ తీరంలో ఆదివారం గుర్తు తెలియని క్షిపణి దాడి కారణంగా సరుకు రవాణా నౌకలో మంటలు చెలరేగినట్లు బ్రిటీష్ సైన్యం తెలిపింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తరలిస్తున్న నౌకపై గుర్తు తెలియని డ్రోన్ లేదా క్షిపణి దాడి జరిగిందని, దీంతో నౌకలో మంటలు చెలరేగాయని యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ (యుకెఎంటిఒ)వెల్లడించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసిందని యుకెఎంటిఒ పేర్కొంది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 23 నాటికల్ మైళ్ల […] The post ఖతార్ తీరంలో నౌకపై క్షిపణి దాడి appeared first on Navatelangana.


ఘనంగా హనుమాన్ దీక్ష హోమ కార్యక్రమంనవతెలంగాణ – గీసుగొండగీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో పురాతన శ్రీ ఆది మహాలక్ష్మి సమేత శ్రీ పాంచాల రాయస్వామి దేవాలయంలో హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో మండల దీక్ష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వాములు కలిసి ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. “సర్వేజనా సుఖినోభవంతు – లోకా సమస్తా సుఖినోభవంతు” అంటూ భక్తులు ఏకనామ సంకీర్తనలు చేస్తూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, […] The post శాయంపేట హవేలీలో భక్తి వైభవం appeared first on Navatelangana.

చెన్నై: టివికె చీఫ్ విజయ్ ఆదివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తిరుచ్చి ఈస్ట్.. పెరంబూర్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే తాజాగా పెరంజూర్ స్థానంలో ఎమ్మల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేయనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు. అయితే ఆ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే.. ఒక దానికి రాజీనామా చేయాలి. తమిళనాడులో అన్నాడిఎంకె అధినేత్రి దివంగత జయలలిత తర్వాత ఏకకాలంలో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన నేతగా విజయ్ గుర్తింపు పొందారు.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి తమిళనాడు సీఎం విజయ్ రాజీనామా చేశారు. పెరంబూర్ సీటును నిలుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. The post తిరుచ్చి ఈస్ట్ స్థానానికి సీఎం విజయ్ రాజీనామా appeared first on Navatelangana.



చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై.. లక్నోని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నో ఓపెనర్ జోష్ ఇంగ్లీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 33 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సులతో 85 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. చివర్లో షహబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి 203 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్లో ఓవర్టన్ 3, అన్షుల్ 2. నూర్ 1 వికెట్ తీశారు.
నవతెలంగాణ-హైదరాబాద్: చెపాక్ వేదికగా లక్నో వారియర్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో..ఇంగ్లిస్ దూకుడుగా ఆడాడు. కేవలం 35 బంతుల్లో 85 పరుగులు చేసి భారీ స్కోర్కు బాటలు వేశాడు. అయితే ఇంగ్లిస్ ఔట్ తో ఒక్కసారిగా స్కోర్ నెమ్మదించింది. మార్కరమ్(06) రనౌట్ కాగా, పంత్(15), మార్ష(10), స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరాడు. పూరన్ […] The post లక్నో వారియర్స్ భారీ స్కోర్ appeared first on Navatelangana.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకూబ్నవతెలంగాణ-నెల్లికుదురుజిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు యండి యాకూబ్ అన్నాడు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం మండల సంగం నాయకుడు బాణాల యాకయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల కుటుంబాలు కూలి మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు అనేక మంది ఉన్నారని అన్నారు. వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర […] The post జిల్లా మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ మాజీ సర్పంచ్ రవికుమార్ పటేల్ పిల్లల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గుండూరు లో బీఆర్ఎస్ కార్యకర్త , పెద్ద ఏడ్గి గ్రామ కార్యకర్త, పడంపల్లి గ్రామ కార్యకర్త, హంగర్గా గ్రామ కార్యకర్త, చిన్నగుల్ల గ్రామ కార్యకర్త, వివాహ మహోత్సవం శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయా గ్రామాలలో శుభకార్యాలు నిర్వహిస్తున్న […] The post శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే appeared first on Navatelangana.

రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి నవతెలంగాణ-మిడ్జిల్ ప్రతిపక్ష నాయకులపై విమర్శలుమాని నియోజకవర్గం అభివృద్ధిపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టి పెట్టాలని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేయడం చిగ్గుచేటని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆగ్రహం […] The post విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి appeared first on Navatelangana.


బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో కలకం రేగింది. ప్రధాని సభ జరిగే చోటు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. రెండు జెలిటెన్ స్టిక్స్ని పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ వాటిని అక్కడి నుంచి తరలించారు. వాటిని అక్కడ పెట్టినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాని మోడీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జెలిటన్ స్టిక్స్ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు.