🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5533 articles

తమిళనాడు సిఎం విజయ్‌కి మోడీ, రాహుల్, రేవంత్ విషెస్
Older
Telangana

తమిళనాడు సిఎం విజయ్‌కి మోడీ, రాహుల్, రేవంత్ విషెస్

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో విజయ్ పరిపాలన అద్భతుతంగా సాగాలని మోడీ ఆకాంక్షించారు. ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని మోడీ అన్నారు. తమళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక సిఎం రేవంత్ రెడ్డి కూడా తమిళనాడు సిఎంగా విజయ్ రాష్ట్రాభివృద్ధిలో ఉన్న శిఖరాలకు చేరుతారని బలంగా నమ్ముతున్నా అని అన్నారు.

కలియుగ వైకుంఠం.. తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
Older
నటి సయానీ గుప్తా మనసు చెప్పిన దారినే ఎంచుకుంది!
Older
Trisha Wishes Video: సూపర్ హ్యాపీగా ఉన్నా.. ఎప్పటికీ విజయ్‌కే నా మద్దతు.. సీఎం దళపతికి త్రిష అభినందనలు
Older
జ్యోతిష్యం:  హనుజ్జయంతి రోజు ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి.. పూజా విధానం వివరాలు ఇవే..!
Older
పోలీస్ వాహ‌నంపై బాంబు దాడి..15మంది మృతి
Older
Telangana

పోలీస్ వాహ‌నంపై బాంబు దాడి..15మంది మృతి

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పాకిస్థాన్ లో పోలీస్ పోస్ట్, వాహనంపై జరిగిన వరుస కారు బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయని అన్నారు. ధ్వంసమైన పోలీస్ అవుట్ పోస్ట్ నుండి 12మంది అధికారుల మృతదేహాలను వెలికితీశామని, తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ఆస్ప్రతికి తరలించామని […] The post పోలీస్ వాహ‌నంపై బాంబు దాడి..15మంది మృతి appeared first on Navatelangana.

సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
Older
దళిత యువకుడి దారుణ హత్య
Older
మిత్రుడిని వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్: మోడీ
Older
Telangana

మిత్రుడిని వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్: మోడీ

హైదరాబాద్: దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సరైనా జెండా లేకపోవడంతోనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకనవుతోందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి డిఎంకెతో కాంగ్రెస్ మంచి సంబంధాలు ఉన్నాయని, డిఎంకె పార్టీతో పొత్తుతోనే అనేక సంక్షోభాల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడిందన్నారు. స్టాలిన్ పార్టీని వదిలి కాంగ్రెస్ టివికెతో చేతులు కలిపిందని విమర్శలు గుప్పించారు. అధికారంపై దురాశతో స్టాలిన్‌కు వెన్నుపోటు పొడించిందని, రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎంత దారుణానికైన ఒడిగడుతుందని విమర్శలు గుప్పించారు. కర్నాటకలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరాటాలతో సుపరిపాలన అందించడం లేదని, గత మూడు సంవత్సరాల నుంచి కర్నాటక ప్రజలు సమస్యలు పరిష్కరించకుండానే అంతర్గత కలహాలను పరిష్కరించుకుంటున్నారని చురకలంటించారు. కర్నాటక ముఖ్యమంత్రి ఎంత కాలంలో కొనసాగుతారో చెప్పలేకపోతున్నారన్నారు. కర్నాటకలో సరైన పాలన లేకపోవడంతో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బిజెపి ఘన విజయం సాధించిందని, భవిష్యత్‌లో కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశ

లక్ష్యాల సాధనకు ఒత్తిడి లేని ఏకాగ్రత అవసరం: మోడీ
Older
Telangana

లక్ష్యాల సాధనకు ఒత్తిడి లేని ఏకాగ్రత అవసరం: మోడీ

బెంగళూరు: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్ అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆధ్యాత్మిక, సేవాభావం ముందు వరుసలో ఉంటాయని అన్నారు. బెంగుళూరు లో మోడీ పర్యటించారు. ఆర్ట్ ఆప్ లివింగ్ 45వ వార్షికోత్సవం లో మోడీ పాల్లొన్నారు. కొత్తగా నిర్మించిన ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగళూరులో మోడీ మీడియాతో మాట్లాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ మానవతావాద సంస్థని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ ప్రతిబింభిస్తుందని, దేశంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలియజేశారు. సమాజశక్తి కలిస్తేనే ఎలాంటి పథకాలైనా విజయవంతం అవుతాయని, అన్ని పనుల్లో సేవ ప్రధానమైనదని మోడీ పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని జయించాలని, ధ్యానం, ప్రాణాయామంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని సూచించారు. ఒత్తిడి, హింస లేని సమాజ నిర్మాణానికి ఆర్ట్ ఆఫ్ లింగ్ విశేష కృషి చేసిందని, అన్నారు. సమాజం బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని, సమాజ శ్రేయస్సుకు సేవ, ప్రేమ వంటి సాధనాలు ఉపకరిస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇదొక ప్రభుత్వ కార్యక్రమం కాదని అందరూ కలిసి చేయాల్సిందని, ఇతరులకు సేవ చేయడం వంటి విషయాలకు ఆర్ట్ ఆఫ్ లివి

కొత్త సీఎంకు స‌చివాల‌య ఉద్యోగుల ఘ‌న స్వాగ‌తం
Older
Telangana

కొత్త సీఎంకు స‌చివాల‌య ఉద్యోగుల ఘ‌న స్వాగ‌తం

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: కొత్త సీఎం విజ‌య్‌కు స‌చివాల‌యం ఉద్యోగులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నేరుగా చైన్నైలోని సీఎం కార్యాల‌యానికి ఆయ‌న చేరుకున్నారు. ఈ సంద్భరంగా సెక్ర‌ట‌రీ ఉద్యోగులంతా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత సీఎం చాంబ‌ర్‌కు వెళ్లారు. ఆదివారం ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను […] The post కొత్త సీఎంకు స‌చివాల‌య ఉద్యోగుల ఘ‌న స్వాగ‌తం appeared first on Navatelangana.

రేపే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు..
Older
ఆర్ఆర్‌పై విజయం.. అలా బ్యాటింగ్ చేయడం కష్టం: కోచ్
Older
Telangana

ఆర్ఆర్‌పై విజయం.. అలా బ్యాటింగ్ చేయడం కష్టం: కోచ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధిచింది. ఈ మ్యాచ్‌లో విజయానికి కారణం కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లే అని బ్యాటింగ్ కోచ్ మాథ్యూ అన్నారు. ‘‘300 స్ట్రైక్‌రేట్‌తో 30 పరుగులు చేయడం ఉత్తేజకరంగా అనిపించినా.. 220 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధిస్తుంటే నిలకడగా.. సుదీర్ఘ సమయం క్రీజు‌లో ఉండటం అవసరం. మా వద్ద ఉన్న టాప్-3 ఆటగాళ్లు 150 స్ట్రైక్‌రేట్‌తో నిలకడగా ఆడగలరు. వాస్తవానికి అలా బ్యాటింగ్ చేయడం కష్టం. కానీ, మా వాళ్లు సుదీర్ఘ కాలంగా నిలకడగా ఆడుతున్నారు. వాళ్ల, ఫిట్‌నెస్, టెస్టులు, వన్డేలు ఆడిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతోందని’’ హేడెన్ పేర్కొన్నారు.

వారెవ్వా
Older
డయాబెటిస్‌పై ఎందుకింత ఫోకస్‌?
Older
నన్ను ఎదుర్కోలేక నా పిల్లలను రాజకీయాల్లోకి లాగుతున్నారు: బండి
Older
Telangana

నన్ను ఎదుర్కోలేక నా పిల్లలను రాజకీయాల్లోకి లాగుతున్నారు: బండి

హైదరాబాద్: తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్నానని, తాను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలనన్నారు. తన కుమారుడిపై నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి దుయ్యబట్టారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని బండి విమర్శించారు. అట్టడుగు స్థాయి నుంచే తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టానని, కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో అప్పుడు కార్పొరేటర్ గా, నేడు ఎంపిగా ఎన్నిక కావడంతో పాటు ఇప్పుడు కేంద్రమంత్రి సేవలందిస్తున్నానని, తాను ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరలేపాయని మండిపడ్డారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో తనని వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యమన్నారు. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. సమ

సీఎం విజయ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Older
నాకు ఆ రెండూ తెలుసు : విజయ్
Older
Telangana

నాకు ఆ రెండూ తెలుసు : విజయ్

చెన్నై: తాను మన అందరివాణ్ణి అని తాను మన ఇంట్లో కుటుంబసభ్యుడునని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తెలిపారు. తమిళ ప్రజలకు రుణపడి ఉంటానని, అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని హామి ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలియజేశారు. తనను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని, ఏది సాధ్యమో అది మాత్రం చేస్తానని, అనుకున్న లక్ష్యాలను సాధిస్తానని విజయ్ పేర్కొన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందని, తన ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుందని, టివికె కార్యకర్తలు లేకుంటే తాను లేనని అన్నారు. ఇది అస్థిర ప్రభుత్వం కాదని, తనకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు అని రాజకీయాల్లోకి వస్తే తాము చూసుకుంటామని ప్రజలంతా ప్రేమగా పిలిచారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కాపాడటం తమ ప్రభుత్వం లక్ష్యమని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, తాను దేవదూతను కాదని అన్నారు. అది చేస్తాం..ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పనని, ప్రజా ధనాన్ని వృధా చేయనని, దోచుకోనని, ప్రభుత్వంలో వేరే పవర్ సె

ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్
Older
తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నరు : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
Older
విజయ్ కేబినెట్ లో.. యంగెస్ట్  మినిస్టర్
Older
సింగరేణి రామగుండం బొగ్గు గనిలో  ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్
Older
తెలంగాణలో యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు
Older
Telangana

తెలంగాణలో యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని.. ఫ‌లితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని […] The post తెలంగాణలో యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA