5607 articles

• రిటైర్మెంట్పై ఐటీఏకు వినేశ్ సమాచారం• అధికారికంగా వీడ్కోలు ఇవ్వలేదని సరికొత్త వాదన న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూ ఎఫ్ఐ) సహా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిబంధ నలు ప్రతిబందకంగా మారాయి. రిటైర్మెంట్ ప్రకటించిన అథ్లెట్లు మళ్లీ ఆటలోకి రావాలంటే.. ఆరు నెలలు ముందుగా వాడాకు ఆ […] The post వినేశ్ రీ ఎంట్రీపై సందిగ్థత appeared first on Navatelangana.

సన్ స్కీన్ వల్ల ఎండ వల్ల చర్మం ఎర్రబడటం, మంట పుట్టడ, పొట్టు ఊడటం వంటి సమస్యల్ని తగ్గించడంలో సన్స్క్రీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అయితే, సన్స్క్రీన్ వాడటం వల్ల ఈ సమస్యను నివారిస్తుంది. ఎక్కువకాలం పాటు వడ దెబ్బ లేదా ఎండ దెబ్బ తగిలితే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి సన్స్క్రీన్ ఉత్తమ మార్గం. అంతేకాదు చర్మం నల్లబడకుండా, మచ్చలు […] The post సన్స్క్రీన్ తో ప్రయోజనాలు appeared first on Navatelangana.

బాటసింగారం మార్కెట్లో పండ్లు అమ్మి వచ్చిన డబ్బులతో ఇంటికి బయలుదేరిన ఓ రైతు ఆటోలో రూ. 55వేలు చోరీకి గురైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన రైతు పోలు అశోక్ బాటసింగారం మార్కెట్లో పండ్లు విక్రయించి వచ్చిన రూ.55 వేల నగదుతో ఇంటికి వెళ్లేందుకు బయలు దేరాడు.ఈ క్రమంలో మార్కెట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దిగిన అశోక్ అక్కడి నుంచి నల్ల చెరువు జిల్లా బస్స్టాప్కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే అప్పటికే ఆటోలో కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో పెట్టి, రైతు జేబులో ఉన్న రూ.55 వేల నగదును అపహరించినట్లు తెలుస్తోంది. కొంతసేపటి తర్వాత డబ్బులు కనిపించకపోవడంతో రైతు మోసపోయిన విషయం గుర్తించి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మేషం ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరాస్తి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. వృషభం వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన కలుగుతుంది. మిధునం గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కర్కాటకం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. స

మేషం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. వృషభం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. మిధునం దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటకం కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ అభివృద్ధిలో భాగంగా గుడితో పాటు మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్జీబ్ ను తెలియజేసేలా ఆ కట్టడాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప అధ్యయన కేంద్రాలుగా అవి పరిఢవిల్లాలని సిఎం ఆకాంక్షించారు. మైనారిటీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాల యంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంప్రదాయ కోర్సులు కాకుండా వారి జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రతిభావంతులైన బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు ప్రోత్సాహాకాలు అందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. గ్రూప్-

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు లంబాడాలు అంటే చిన్న చూపు ఉందని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ధ్వజమెత్తారు. గతంలో తమ పార్టీ లంబాడాను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెడితే పట్టుబట్టి ఓడించారని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎస్సి, ఎస్టి, బిసిలు పోరాడితే, కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులు పొంది ఎంజాయ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఆర్దిక ఇబ్బందుల్లో నెట్టింది కెసిఆరేనని ఆయన విమర్శించారు. కెటిఆర్ రాజకీయాలు రాష్ట్రానికి పనికి రావన్నారు. భవిష్యత్తులో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే తగు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కెటిఆర్ నిజాయితీ గురించి తమకు తెలుసునని, బాగోతం మొత్తం బయటపెడతామని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏమైనా అంటే కెటిఆర్ను ప్రజల్లో తిరగనీయమని ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు.

ఎపిలోని ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలంలో 14 ఏళ్ల బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందు కు 42 ఏళ్ల పాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే స్థానిక చర్చిని నడుపుతున్న నింది తుడు చౌటపల్లి రాంబాబు తన ప్రార్థనలకు హాజరైన ఒక కూలీ కుటుంబానికి చెందిన కుమార్తెపై కన్నేసిన ఫాస్టర్ తరచూ అమెపై అత్యాచా రానికి పాల్పడేవాడు. మౌనంగా ఉండేలా ఆమెను బెదిరించేవాడు. ఈ క్రమంలో నెలసరి తప్పిన బాలికకు నిందితుడు అధిక మోతాదులో గర్భనిరో ధక మాత్రలు బలవంతంగా తాగించడంతో పరిస్థితి ప్రాణాపాయంగా మారింది. ఆ మందుల వల్ల తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగింది. నొప్పిని భరించలేక బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో ఆమెను వెంటనే ఏలూరులోని ఆసుపత్రిలో చేర్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధా రంగా అధికారికంగా కేసు నమోదు చేసినట్లు తడికలపూడి సబ్ -ఇన్స్పెక్టర్ వల్లి పద్మ ధృవీకరించారు. బాధితురాలు చికిత్స పొందుతుండగా నింది తుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ‘పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని అరెస్టు చేయడానికి తాము ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాము,‘ అని ఎస్ఐ తెలిపారు. బాధితురాలి కు

ఐపిఎల్లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది నాలుగో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (50), కెఎల్ రాహుల్ (23) శుభారంభం అందించారు. చివర్లో అశుతోష్ శర్మ (39) మాత్రమే కాస్త మెరుగ్గా రాణించాడు. మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన కోల్కతా 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ 47 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కామెరూన్ గ్రీన్ 33 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని...వలలో వేసుకున్న నిందితులు బాధిత బాలికలను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 25 మందికి పైగా యువతులు ఈ నిందితుల చెరకు చెక్కి విలవిలలాడుతున్నట్లు తెలిసింది. బాధిత బాలికలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిన సోదరులు అర్జున్, రాజీవ్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నాలుగు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితులైన సోదరులతో పాటు వారి తల్లి, మేనమామలను కూడా ఈ కేసులో కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ఓ బాధిత బాలిక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. తమ కూతురును వదిలిపెట్టాలని బాలిక తల్లిదండ్రులు కన్నీటితో విన్నవించగా, మా అబ్బాయి...మీ అమ్మాయి జోలికి రాకుండా ఉండాలంటే రూ.25 లక్షలు ఇవాల్సిందేనని అర్జున్ తల్లి,మేనమామలు

తీవ్రతరం అవుతున్న సంక్షోభంతో కారుమేఘాలు దేశ గగనతలంపై కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగం, వేతనాల ప్రతిష్టంభన జంట సంక్షోభాలై వుండగా అదనంగా ధరల పెరుగుదల అంచనాలు హడలగొడు తున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని గొలుసుకట్టు ప్రభావం కనిపిస్తున్నాయి. ఇంధనం, ఎరువుల ధరలు మండిపోతుంటే ఆహార సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమై అవీ ధరలు పెరుగుతున్నాయి. వీటి ఛాయలు ఇప్పటికే ఇండియాపై పడ్డాయి. మోడీ సర్కారు అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో ఇప్పటికే సన్నిహితమై పోయింది. ఇరాన్పై దాడి […] The post భయానక ఆర్థిక సంక్షోభం – సర్కారు నిర్లక్ష్యం appeared first on Navatelangana.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో పోషించిన పాత్రకు తాను సూట్ అవ్వలేదేమోనని అనిపించిందని ఆమె చెప్పడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను పొందలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్కు ఆ కథ, పాత్రలు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమాకు ఓకే చెప్పడానికి కారణాల గురించి మాట్లాడిన సాయి పల్లవి.. “ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నా. అందుకే మనసుకు హాయిగా అనిపించే కథ చేయాలని అనిపించింది. ఏక్ దిన్ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ సన్ రైజ్ సినిమా గుర్తొచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పా’‘ అని తెలిపారు.

టివికెకు సిపిఐ మద్దతు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే కీలక పాత్ర పోషించారు. ఆయన శుక్రవారం అర్జంటుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో ఫోన్లో మాట్లాడారు. తమిళనాడులో విజయ్ పార్టీ టివికె ఏర్పాటు కావాలంటే సిపిఐ మద్దతు కూడా అవసరం అని లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఏదో సాకుతో అక్కడ కొత్త ప్రభుత్వ స్థాపనలో జాప్యం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బిజెపికి అవకాశం ఇవ్వకుండా చేయాల్సి ఉందని తెలిపారు. తరువాత రాజా తాము ఆలోచించి చెపుతామని పేర్కొన్నారు. డిఎంకె సహా ఇతర పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుందని రాజా ఖర్గేకు చెప్పారు . తరువాత ఈ క్రమంలోనే టివికెకు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం అయింది.

ఇండోనేసియాలో అగ్నిపర్వతం పేలుడు ఘటనలో కనీసం ముగ్గురు పర్వతారోహకులు మృతి చెందారు. ఇండోనేసియా మారుమూల దీవి హల్మాహెరాలో మౌంట్ దుకోనో గురువారం పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లారు. ఇదే దశలో అగ్నిపర్వతం బద్దలు అయింది. 1355 మీటర్ల ఎతైన గుట్టల వద్దకు వెళ్లుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం పర్వతారోహకులకు నిషిద్ధ ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ వీరు ఈ ప్రమాద భరిత మార్గంలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని ఈ ప్రాంతపు పోలీసు అధికారి ఎర్లిచ్సన్ పసరిబు తెలిపారు.

వరి కోతలు కోసి ఇరవై ఏడురోజులు దాటింది. ఇరవై రోజుల వరకు కొనుగోలు చేసే నాథుడే లేడు. ప్రతిరోజు ఎండల్లో వడ్లను ఎండబెట్టడం కొరకు నేర్పుతూ కుప్పలు పోస్తూ మండేఎండల్లో శ్రమిస్తూ రైతులు వడదెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని మొండికేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఏమి పట్టనట్లు ఉదాసీనంగా ఉంది. లక్షలాదిమంది తెలంగాణ, దేశంలోని రైతాంగం దిక్కుతోచక ఎండల్లో వరి కుప్పల […] The post మలమల మాడే ఎండల్లో…దినదిన గండంగా రైతులు! appeared first on Navatelangana.

దేశంలో కార్మిక వర్గం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం సాధారణ ఆర్థిక సమస్య కాదు. అది పాలక వర్గాల విధానాల వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్న సామాజిక-ఆర్థిక సంక్షోభం. వేతన స్తంభన, పనిగంటల పెంపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఒప్పంద కార్మిక వ్యవస్థ విస్తరణ, ఉద్యోగ భద్రత లేకపోవడం-ఈ నాలుగు అంశాలు కలిసి కార్మికుల జీవితాలను అస్తిరత్వంలోకి నెట్టేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇటీవల జరిగిన కార్మిక నిరసనలు వారి సమస్యలన్నింటినీ వెలుగులోకి తెచ్చాయి.నోయిడా, ఫరీదాబాద్ వంటి పారిశ్రామిక కేంద్రాలు దేశ అభివృద్ధికి […] The post నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్ సర్కార్ ధోరణులు appeared first on Navatelangana.

భూమిని దోచుకుంటూ, వనరులను వశపర్చుకుంటూ, ప్రకృతిని నాశనం చేసుకుంటూ తీసుకొస్తున్న ‘అభివృద్ధి’ నమూనా చివరకు నీటిచుక్క కోసం ఒకరినొకరు చంపుకునే దారుణస్థితికి తీసుకొచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలభై రెండు మంది చనిపోయారు. ఆఫ్రికాలోని చార్డ్ దేశంలో ఇటీవల జరిగిన ఈ విషాదం మానవ నాగరికత వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం. వాదీ ఫిరా ప్రావిన్స్లో ఉన్న ఒకే బావి స్థానికులకు ఆధారం. కాగా, దాహం తీర్చుకోవడానికి ఆ బావి వద్దకు వెళ్లిన కొంతమంది తిరిగి […] The post రక్త‘దాహం’ appeared first on Navatelangana.

కార్తిక్ జయంతిని హీరోగా పరి చయం చేస్తూ రే సన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా, మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ‘లవ్ టైడ్ బై ఫేట్అనే ట్యాగ్లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, […] The post వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రాయవలస appeared first on Navatelangana.

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో తారక్ పొన్నప్ప […] The post స్టెప్పులు వేయించే ‘లబ్బరు బొమ్మ` appeared first on Navatelangana.


విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా 'పవర్పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్లో ప్రారంభమవుతుంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ, […] The post ‘పవర్ పేటలో సేనాపతి రవిగా.. appeared first on Navatelangana.

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లీజ్ డేట్ పోస్టర్లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్లో కనిపించారు. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని చూపించింది. […] The post వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్ appeared first on Navatelangana.
