5607 articles


తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయింది బిఆర్ఎస్ నేత కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపుల కోసం ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే వినియోగిస్తున్నారని దీనివల్ల ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని కెటిఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల క్షీణతపై బిఆర్ఎస్ ప్రతినిధి బృందం డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ డిజి ర్యాంక్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురవ్వడం దిగ్భ్రాం తి కరమని ఆయన పేర్కొన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై ఒకయువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భ

చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటు పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శనివారంనా డు టివికె అధినే విజయ్ సిఎంగా ప్రమాణ స్వీకా రం చేస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్ నాయకత్వలోని టివికె కు ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మ ద్దతు ప్రకటించగా నలుగురు నలుగురి సభ్యుల బ లం ఉన్న వామపక్షాలు, ఇద్దరేసి సభ్యులతో కూడి న విసికె, ఐయుఎంఎల్ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మద్దతు పలికాయి. దీంతో విజయ్కు ప్రభు త్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ 118కి చేరడంతో శుక్రవారంనాడు సాయంత్రం ఆయన తన పార్టీ నేతలతో వెళ్లి గవర్నర్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని కోరారు.కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ మద్దతు లేఖ కూడా ఆయనకు అందజేశారు. కాసేపట్లో మిగతా రెండు పార్టీల లేఖలు కూడా మీకు అందుతాయని గవర్నర్కు తెలిపారు. అయితే సివికె తమ మద్దతు లేఖను గవర్నర్కు పంపించలేదు. ఉదయం మద్దతు ప్రకటించిన ఐయుఎంల్ రాత్రికల్లా ప్లేటు ఫిరాయించింది. టివికెకు తాము మద్దతు తెలపడం లేదని ఖరాఖండిగా ప్రకటించింది. విసికె ఇంకా వైఖరి తేటతెల్లం చేయలేదు. దీంతో విజయ్ బలం 116 వద్ద

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇత ర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మనంద రం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని కోరారు. హైదరాబాద్లోని నాంపల్లి హజ్ హౌజ్లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సుల ప్రారంభోత్సవం లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలు త మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జా ఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టిజిఎంఆర్ఇఐఎస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టిజిఎంఎఫ్సి చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హౌజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని అన్నారు. దీంతో హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంద

ఏకపక్ష ఒప్పందంపై అప్రమత్తంసుంకాలతో భారత్కు ముప్పు జిటిఆర్ఐ హెచ్చరిక న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలతో భారత్కు ముప్పు పొంచి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ) హెచ్చరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భారత్ తొందరపడకూడదని స్పష్టం చేసింది. తగిన ప్రతిఫలం లభించని పక్షంలో ఇది కేవలం అమెరికా ప్రయోజనాలకే ఉపయోగపడే ఏకపక్ష ఒప్పందంగా మిగిలిపోయే ప్రమాదం తెలిపింది. ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య విధానాలపై లోతైన విశ్లేషణలు […] The post ట్రంప్తో ఒప్పందానికి తొందరపడొద్దు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమ లు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని సబ్ కమి టీ నిర్ణయించింది. ప్రజాభవన్లో మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మూసీ డిపిఆర్ను అధికారులు మంత్రులకు సమర్పించారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం దాదాపు రూ.7,055 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల సేకరణకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నివాస గృహాలు లేదా ఇతర నిర్మాణాలపై ప్రభావం పడకుండా ప్రాజెక్టు అలైన్మెంట్లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఎటువంటి నిర్మాణాలకు ఆటంకం కలగని విధంగా ఉన్న ప్రాంతంలో మొదటి 5 కిలోమీటర్ల మేర పనులను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలి

విదేశీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయిఅందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్..ఆటోలకు ఉచితంగా ఈవీలుగా మార్పుసర్ పేరుతో ఓట్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోంహజ్ యాత్రీకులకు కేంద్రం పెంచిన చార్జీలను రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుందిహజ్ యాత్రికుల బస్సులను జెండాఊపి ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ప్రపంచవ్యాప్తంగా బ్లూ కలర్ జాబ్స్ కు డిమాండ్ పెరుగుతున్నదని సీఎం ఏ రేవంత్రెడ్డి చెప్పారు. గతంలో వైట్ కాలర్ ఉద్యోగాల కోసం పోటీ ఉండేదనీ, ఇప్పుడు విదేశీ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంటే జర్మనీ, […] The post బ్లూకాలర్ జాబ్స్కే డిమాండ్ appeared first on Navatelangana.

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు టెహ్రాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతి దాడులుఒప్పందంపై వెంటనే సంతకం చేయండి : ట్రంప్యూఏఈ పైనా ఇరాన్ దాడులుయుద్ధంలో అమెరికాకు భారీ నష్టం : వాషింగ్టన్ పోస్ట్దెబ్బతిన్న 15 సైనిక స్థావరాలలోని 228 నిర్మాణాలుఫ్లోరిడాకు మారిన అమెరికా నేవీ కేంద్ర కార్యాలయం నవతెలంగాణ – జనరల్ డెస్క్మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధి ప్రాంతం దాడులు, ప్రతి దాడులతో అట్టుడికిపోయింది. […] The post హార్ముజ్లో కాల్పులు appeared first on Navatelangana.

ఇరాన్ యుద్ధం సెగన్యూఢిల్లీ/రోమ్: ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన తీవ్ర అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. గత మూడు ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్) ఆహార ధరల సూచీ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ సూచీ 1.6 శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.5 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో రాకపోకలు నిలిచిపోవడం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిందని […] The post మూడేండ్ల గరిష్టానికి ప్రపంచ ఆహార ధరలు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: మొక్కజొన్న మార్కెట్కు అధికంగా వస్తున్నందున, ఉమ్మడి జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్, వరంగల్కు వ్యవసా య శాఖ సంచాలకులు గోపి, మెదక్ ఖమ్మంకు సహకార శాఖ స్పెషల్ కమిషనర్ రాహుల్ రా జ్, మహబూబ్నగర్, రంగారెడ్డిలకు ఉద్యానవ న సంచాలకులు యాస్మీన్ బాషా, ఆదిలాబాద్, నల్గొండకు హాకా ఎండి కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్కు గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. కాగా, మొక్కజొన్న కొనుగోళ్ల లో వేగం పెంచాలని, ఈ క్రమంలో ఎదురయ్యే హమాలీల కొరత, గన్నీ బ్యాగులు, గోదాముల లభ్యత, రవాణా అంశాల్లో ఇబ్బందులు లేకుం డా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్తో కొనుగోళ్లలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం రూ. 1,650 కో ట్లతో 1.22 లక్షల మంది రైతుల నుండి 6.74 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగో లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మ

– ఎన్ఐవీన్యూఢిల్లీ: క్రూజ్ నౌక ఎంవీ హిండియస్లో హంటా వైరస్ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం మరింత ఆందోళనకు కారణ మవుతోంది. ఈ పరిణా మాలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( ఎన్ఐవీ) డైరెక్టర్ నవీన్ కుమార్ స్పందించారు. ఈ వైరస్ కేసులు అక్కడక్కడ కనిపిస్తున్నాయని, వైరస్తో భారత్కు తక్షణ ముప్పు ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి సామూహిక వ్యాప్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ”ఈ వైరస్ మానవుల […] The post హంటా వైరస్తో భారత్కు తక్షణ ముప్పు లేదు appeared first on Navatelangana.

బి.వి.యన్.పద్మరాజుఅది 2024.. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారం, ఎలక్షన్ మ్యానిఫెస్టో…అందులోని 12వ పేజీలో ‘పీఎం ముప్తి బిజిలీ యోజన’ కింద దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్ను అందజేస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారు. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ కు కూడా ఇది వర్తింస్తుందని ఆయన ప్రకటించా రు. ఇది జరిగి రెండేండ్లు. ఇప్పటికీ తెలంగాణలో ని ఒక్క కుటుంబానికి కూడా ప్రధాని చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్ అందలేదు. ఎన్నికలప్పుడు ఇదంతా చేస్తామని […] The post వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు appeared first on Navatelangana.

ఆర్థిక ఇబ్బందులున్నా పూర్తిచేస్తాంమహారాష్ట్రను ఒప్పించే బాధ్యత బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలదేస్వలాభం కోసమే కేసీఆర్ కాళేశ్వరానికి ప్రాజెక్టు తరలింపుఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుమంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యేలతో కలిసి ‘ప్రాణహిత’ నిర్మిత స్థల సందర్శన నవతెలంగాణ`కాగజ్నగర్రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ను కట్టి తీరుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని శుక్రవారం […] The post తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్సిఆర్బి గణాంకాలతో తెలంగాణలో నేరాల పరిస్థితి భయానకంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తా రు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రా ష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరమన్నారు. సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులు, మహిళల భద్రతపై ఎన్సిఆర్బి గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని కరీంనగర్ నగల దుకాణం దొంగలను ఇప్పటికి పట్టుకోలేక సాకులు చెబుతున్నారని అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి జరిగితే, శుక్రవారం ఐఏఎస్ క్వార్టర్స్ లో ఏకంగా ఐపిఎస్ అధికారిని భార్య హత్య చేశారన్నారు. సిపి సుమతి ఆపరేషన్తో మహిళల భద్రత బట్టబయలైందని ముఖ్యమంత్రిగా, హోమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని హరీష్రావు ఓ ప్రకటనలో విమర్శించారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అధిక శాతమని ఆయన తెలిపారు. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మంది మిస

నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసిన దుండగులుకీలకపాత్ర పోషించిన పనిమనిషిపథకం ప్రకారమే హత్యనేపాలీ గ్యాంగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలిహైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నవతెలంగాణ సిటీబ్యూరోహైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్లో దారుణ హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఐపీఎస్(డీజీ) అధికారి భార్య నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దుండగులు హత్యచేశారు. బంగారం, డబ్బుల కోసం అదును చూసుకుని పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ […] The post విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య appeared first on Navatelangana.

నియామక పరీక్ష నోటిఫికేషన్ ఆలస్యానికి నిరసనబీహార్ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆందోళనలపై ఉక్కుపాదం పాట్నా : బీజేపీ అధికారంలోకి రాగానే బీహార్ లో ఖాకీ జులుం ప్రదర్శించింది. నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. బీపీఎస్పీ టీఆర్ఈ పరీక్ష తేదీని ప్రకటించటంలో ఆలస్యమవుతుండటంతో, నిర్ణీత గడువు నాటికి అభ్యర్థుల వయస్సు దాటిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం పాట్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ప్రదర్శన నిర్వహించారు. నిరసన చేస్తున్న అభ్యర్థులు పాట్నా కళాశాల నుంచి తమ యాత్రను ప్రారంభించారు. […] The post నిరుద్యోగులపై విరిగిన లాఠీ appeared first on Navatelangana.

జాయింట్ కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు నవతెలంగాణ-లక్షెట్టిపేటమంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం శుక్రవారం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నచ్చజెప్పినా రైతులు వినిపించుకోలేదు. చివరకు విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయన కాళ్ల మీదపడి.. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నాడు. అకాల వర్షాల వల్ల ధాన్యం […] The post కాళ్లుమొక్కుతా సారు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఇంట్లో పనిచేసే మనుషులే యజమానిని హత్య చేయడంతో హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో గురువారం అర్దరాత్రి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ(55) ఆమె నివాసంలో హత్యకు గురయ్యారు. శుక్రవా రం హత్య విషయం తెలిసిన వెంటనే డిజిపి సివి ఆనంద్, నగర కమిషనర్ వి.సి సజ్జనార్, శాంతి భద్రతల డిజిపి మహేష్ ఎం భగవత్లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి, ఘటనపై ఆరాతీశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలతో ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కల్పన మరో ముగ్గురితో కలిసి ముందస్తు ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తనూజ ఒంటరిగా ఉన్న విషయాన్ని తన గ్యాంగ్కు చెప్పిన కల్పన గురువారం అర్ధరాత్రి సమయంలో వారితో కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా ఇంట్లో పనిచేస్తున్న కల్పన హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకుని నిందితులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును అత్యం

కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తొలగని అనిశ్చితి.. అనేక నాటకీయ పరిణామాలుగవర్నర్ రాజేంద్ర అర్లీకర్తో టీవీకే చీఫ్ విజయ్ సమావేశం..120 మంది సభ్యుల సంఖ్యా బలాన్ని చూపెట్టిన దళపతిమద్దతు పలికిన వామపక్షాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడని అధికారిక ప్రకటన..మద్దతు లేఖ ఇచ్చిన వీసీకే.. ధృవీకరించని లోక్భవన్టీవీకేకు హ్యాండిచ్చిన ఐయూఎంఎల్..రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ ఇండియా కూటమికి గుడ్బైడీఎంకే సంచలన నిర్ణయంకొత్త ప్రభుత్వ ఏర్పాటులో తొలగని అనిశ్చితి.. రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ చెన్నై : […] The post తమిళనాడులో వీడని సస్పెన్స్! appeared first on Navatelangana.

ఇండియా కూటమికి గుడ్బైలోక్సభ స్పీకర్కు కనిమొళి లేఖకుదిరిన టీవీకే-కాంగ్రెస్ పొత్తుకాంగ్రెస్తో డీఎంకే కటీఫ్ఈ మేరకు లోక్సభలో తమ సీట్లను మార్చాలని స్పీకర్ ఓం బిర్లాకు వినతి చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై చెప్పింది. లోక్సభలో తాము కూర్చునే సీట్లను మార్చాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తమ ఎంపీలు […] The post డీఎంకే సంచలన నిర్ణయం appeared first on Navatelangana.

లెబనాన్పై 4-0తో సంచలన విజయంతొలిసారి క్వార్టర్ఫైనల్లో ప్రవేశంఏఎఫ్సీ అండర్-17 ఆసియా కప్ న్యూఢిల్లీ : భారత ఫుట్బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం. భారత మహిళల యువ జట్టు ఆసియా కప్లో అద్భుతం చేసింది. రెండు దశాబ్దాలుగా ఆసియా కప్లో ఒక్క విజయం సాధించని అమ్మాయిలు, ఏఎఫ్సీ ఆసియా కప్ చరిత్రలో ఎన్నడూ నాకౌట్ దశకు చేరుకోని భారత్ ఇప్పుడు ఆ రెండింటిని సాకారం చేసుకుంది. చైనాలోని సుజోవ్లో జరుగుతున్న ఏఎఫ్సి మహిళల అండర్-17 ఆసియా కప్లో టీమ్ […] The post అమ్మాయిల కొత్త చరిత్ర appeared first on Navatelangana.

ప్రాంఛైజీ యజమానులకు సైతం గైడ్లైన్స్ఐపీఎల్లో అమల్లోకి కఠిన నిబంధనలు ముంబయి : ఐపీఎల్లో మితిమీరుతున్న గర్ల్ఫ్రెండ్స్ కల్చర్కు అడ్డుకట్ట వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ సీజన్లో పలు సంఘటనలు సోషల్ మీడియాలో దుమారం రేపటంతో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ప్రాంఛైజీ యజమానుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్ఓపీ)లో మార్పులు తీసుకొస్తూ ఏసీఎస్యూ సమగ్ర నివేదికను బీసీసీఐకి […] The post అపరిచితులకు ప్రవేశం లేదు! appeared first on Navatelangana.

ఢిల్లీ 142/8, కోల్కతా 147/2కోల్కతా నైట్రైడర్స్ ఆఖర్లో47 బంతుల్లోనే శతక షోఢిల్లీపై కోల్కతా ఘన విజయం అదరగొడుతోంది. ఆరంభంలో ఆరు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధించని నైట్రైడర్స్.. తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. బౌలర్లు రాణించటంతో ఢిల్లినీ 142 పరుగులకు కట్టడి చేసిన నైట్రైడర్స్.. అలెన్ (100 నాటౌట్) అజేయ సెంచరీతో అలవోక విజయం సాధించింది. న్యూఢిల్లీ : ఫిన్ అలెన్ (100 నాటౌట్, 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్లు) సుడిగాలి […] The post అలెన్ అదరహో appeared first on Navatelangana.