5637 articles



– నీటిపారుదల శాఖ ఈఈ మోడెం సత్యనారాయనవతెలంగాణ-తుంగతుర్తిరైతులకు సాగునీరు అందించడం, నీటి వృధాను అరికట్టడం, కాలువల్లో పూడికతీత, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి నీటిపారుదల శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈఈ మోడెం సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవునిగుట్టతండ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గుగులోత్ స్వాతి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడం, భూగర్భ […] The post సాగునీరు అందించడమే నీటిపారుదల శాఖ లక్ష్యం appeared first on Navatelangana.

నవతెలంగాణ – ఆలేర్ రూరలప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్,పిఎసిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం ప్రారంభించారు.శిబిరంలో భాగంగా 35 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స అందించడంతో పాటు లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.అలాగే వేసవికాలంలో పశు సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు […] The post ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌను మే 10న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తెలంగాణలో వేలకోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవంతో శ్రీకారం చుట్టానున్నట్లు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైల్వే, జాతీయ రహదారులకు అత్యధిక బడ్జెట్ కేటాయించి, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం పనులు, వరంగల్లోఎయిర్ పోర్ట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తో మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలియజేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ తదుపరి సాయంత్రం నాలుగు […] The post ప్రధాని మోడీ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.

కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో అమిత్షా సమక్షంలో జరిగిన శాసనసభాసక్ష సమావేశంలో పశ్చిమ బెంగాల్ సిఎంగా సువేందు పేరును అమిత్ షా ప్రకటించారు. శనివారం బెంగాల్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్ సోదరుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సామాజికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ హాజరై, నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, నల్ల […] The post చిందం మల్లిఖార్జున్ సోదరుని వివాహానికి హాజరైన ర్యాకల appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో ఈనెల 20వ తేదీన జరుగు తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా 3వ మహాసభ విజయవంతం చేయాలని, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కవెంకటేష్ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. మాహాసభకు కాన్రాజ్ శీను అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ కల కల కోసం కాదు, కల ప్రజల కోసం అని చెప్పారు. నైజాం పోరాటంలో పాటలు రాసి ఆటలాడి ప్రజలు చైతన్యం చేసి, భూమికోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం […] The post ప్రజానాట్యమండలి జిల్లా మహాసభను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్: తన సొంత నియోజకవర్గమైన కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కోడంగల్ చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు. కృష్ణా జలాలతో కోడంగల్ భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కోడంగల్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర […] The post కోడంగల్ నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తా: సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినా విషయం తెలిసిందే. ఈక్రమంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా బ్లాక్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకే, కాంగ్రెస్ కలిసి ప్రచారం చేశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదు స్థానాల్లో గెలిచిన హస్తం అభ్యర్థులు.. విజయ్ అభ్యర్థన మేరకు టీవీకేకు […] The post కాంగ్రెస్తో డీఎంకే పొత్తు కట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు మే 9, 2026 (శనివారం) ఉదయం 11:00 గంటలకు.. కోల్కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు, […] The post బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..! appeared first on Navatelangana.







రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ, ఎట్టకేలకు జూన్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే విదేశాల్లో ఒకరోజు ముందుగానే పెద్ది సందడి చేయనుంది. తాజాగా అక్కడ ప్రీసేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్కేకుల్లా అమ్ముడయ్యాయి. 24 గంటలు కూడా కాకముందే లక్ష టికెట్స్ సేల్ అయ్యాయి. దీంతో నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఇన్ని టికెట్స్ అమ్ముడైన తొలి సినిమాగా ‘పెద్ది’ రికార్డు నెలకొల్పింది.




నవతెలంగాణ-హైదరాబాద్: ‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి` అని ఎంపి మహువా మోయిత్రా పేర్కొన్నారు. రక్షణ పై పార్లమెంటరీ స్థాయి కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతుండగా, ఇండిగో విమానంలో కొందరు పురుషులు తనను వేధించారని తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపి మహువా మోయిత్రా గురువారం ఆరోపించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో పెట్టిన ఒక పోస్ట్లో, ఇండిగో ఫ్లైట్ 6E 719లో ఈ సంఘటన జరిగిందని తృణమూల్ ఎంపి తెలిపారు. ” నేను ఈ రోజు […] The post ‘ఎందుకు ఆశ్చర్యం.. ఇది బిజెపి సంస్కృతి` appeared first on Navatelangana.
