బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఒకే ప్రాజెక్ట్ ద్వారా రూ.325 కోట్ల ఆదాయం పొందినట్లు సమాచారం. ధురంధర్ చిత్రానికి సంబంధించిన లాభాల భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఈ భారీ మొత్తం ఆయనకు దక్కినట్లు తెలుస్తోంది. దీంతో షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలను అధిగమించి, ఒకే ప్రాజెక్ట్‌కు అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ నటుడిగా నిలిచారు.