ODI World Cup 2027: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టీం ఇండియా వికెట్ కీపర్ స్థానంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఫామ్ కోల్పోయి తడబడుతున్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టి, కేరళ స్టార్ సంజూ శాంసన్‌కు వన్డేల్లో శాశ్వత చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.