ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు వీలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం సంచలన ప్రకటన చేశారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇకపై ప్రతి వారం రెండు రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది.