మారుతున్న వాతావరణంతో వ్యవసాయంలో సవాళ్లు నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు తెగుళ్ల బెడద ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పంటలకు తెగుళ్లు సోకిన తర్వాత, వాటిని ఎదుర్కోవడం రైతులకు చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కొందరు రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి సాంప్రదాయ, దేశీయ పద్ధతులను అవలంబిస్తున్నారు. రసాయన పురుగుమందులు సులభంగా అందుబాటులో లేని పూర్వ కాలంలో, తమ పూర్వీకులు కీటకాలను తరిమికొట్టడానికి బొప్పాయి ఆకులను ఉపయోగించేవారని చెబుతున్నారు. ఈ సాంప్రదాయ పద్ధతి నేటికీ అంతే ప్రభావవంతంగా నిరూపించబడుతోంది. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..