హైదరాబాద్‌లో సుదీర్ఘకాలంగా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సైదాబాద్, చంచల్‌గూడ, సంతోష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు భారీ ఊరట కలిగించే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మించిన ఈ కీలక వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు మరో అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అదే ఈ వంతెనకు ఏ పేరు పెట్టాలన్నది..!