నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే క్షణం గడవదు. డిజిటల్ చెల్లింపుల నుండి వినోదం వరకు అన్నీ దానిలోనే ఉన్నాయి. అయితే మనం ఫోన్‌ను ఎంతలా వాడుతున్నామంటే, దానికి కనీసం స్విచ్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఈ అలవాటు మన ఫోన్ ప్రాణాలను మెల్లమెల్లగా తీస్తోందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీడర్స్ డైజెస్ట్, ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థల విశ్లేషణ ప్రకారం.. వారానికి కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయడం అనేది ఒక డిజిటల్ థెరపీ లాంటిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.