టాలీవుడ్‌లో థియేటర్ల వివాదం మళ్లీ రాజుకుంది. మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ల కేటాయింపు, సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లేఖ విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరితో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 16 మంది నిర్మాతలు కలిసి ఈ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.