తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై టీటీడీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలని భక్తులకు సూచించింది.