ఎస్వీబీసీ నూతన సారథిగా శ్రీధర్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర చేతుల మీదుగా అధికారిక నియామక పత్రం అందుకున్న ఆయన, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నెల 22న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.