హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ జెప్టో ఉద్యోగుల మధ్య జీతం వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. జీతం తక్కువగా వచ్చిందని ఉద్యోగి ప్రశ్నించగా వాగ్వాదం పెరిగి దాడులు జరిగాయి. అల్తాఫ్ అనే ఉద్యోగిపై ఇద్దరు దాడి చేయగా, ఆ తర్వాత అల్తాఫ్ స్నేహితులతో తిరిగి దాడి చేశాడు.