దేశ రాజధాని ఢిల్లీ శివారు గ్రేటర్ నోయిడాలోని దాద్రి ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అధిక లోడుతో వెళ్తున్న ఓ డంపర్ ట్రక్కు నుంచి భారీగా ఎర్రరాళ్లు రోడ్డుపై పడిపోవడంతో కొంతసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.