ఒడిశాలోని గంజాం జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. బస్సు ఆటోరిక్షాను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పురుషోత్తంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లడ్కపల్లి స్క్వేర్ సమీపంలో వేగంగా వచ్చిన బస్సు, మా సింహాసిని ఆలయానికి వెళ్తున్న భక్తులతో ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మరి ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయపడిన వారిని మొదట కోడాలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి, అనంతరం బెర్హాంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించారు.

మృతులంతా చికిటీ బ్లాక్‌లోని ఎరెండా గ్రామానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి రూ.4 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.