కోల్‌కతా: దుర్గాపూజ సందర్భంగా మాంసాహారం తీసుకోవడం వివాదాస్పద అంశం కాదని పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ అన్నారు. బెంగాల్‌ సంస్కృతి, సంప్రదాయాల్లో మాంసాహారానికి ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.

దుర్గాపూజ వేడుకల సమయంలో బెంగాలీలు మాంసాహారాన్ని వదిలిపెట్టాలని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి, బాగేశ్వర్ బాబాగా ప్రసిద్ధి చెందిన ఆయన చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మతపరమైన సందర్భాల్లో మాంసాహారం తీసుకునేవారిని శాస్త్రి విమర్శించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది.

కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఘోష్.. బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా మేకలను బలి ఇచ్చే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. ఆ మాంసాన్ని ప్రసాదంగా స్వీకరించే ఆచారం కూడా ఉందని, అందువల్ల మేక మాంసం తినడం బెంగాల్‌లో వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రజలు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఘోష్ స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా చేపలు మాత్రమే తింటానని చెప్పిన ఆయన.. ఇతరులు తమ ఇష్టానుసారం ఆహారాన్ని ఎంచుకోవడాన్ని ఎవరూ అడ్డుకోకూడదన్నారు.

శాకాహారాన్ని ప్రోత్సహించే సాధువుల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన కారణాలతో వారు శాకాహారాన్ని సూచిస్తారని ఘోష్ అన్నారు. అయితే అలాంటి అభిప్రాయాలను మొత్తం సమాజంపై ఆహార నియమాలుగా విధించకూడదని సూచించారు.

గత ప్రభుత్వాలు ప్రజల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయని ఘోష్ విమర్శించారు. ప్రజలు ఏం తినాలనే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని