న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత జట్టు.. తన 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది. 1932 నుంచి టెస్టులు ఆడుతున్న భారత్‌కు ఇది ఆల్‌టైమ్ నంబర్ వన్ బిగ్గెస్ట్ విక్టరీగా నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఫాలోఆన్ ఆడించి మరీ గెలిచిన టీమిండియా.. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చాటింది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు సంబరాలు చేసుకుంటూ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో భారత్ సాధించిన టాప్-5 భారీ విజయాల్లో ఈ గెలుపు తొలి స్థానంలో నిలిచింది.