
మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద సందిగ్ధానికి అధిష్టానం తెరదించింది. పార్టీలో కొత్త, పాతవారిని కలుపుకొని పోయేలా మధ్యేమార్గంగా అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఫార్మూలా ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఇక నుం చి నామినేటెడ్ పోస్టుల నియామకంలో పాత వారికి 60శాతం, కొత్తవారికి 40తం పదవు లు దక్కేలా ఎంపిక జరగాలని ఇటీవల ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర సమన్వయ కమిటీకి అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. శాసనసభ ఎన్నికల సందర్భంగా, అలాగే అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి లో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో పాత వా రికి కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారి కే పదవులు దక్కుతున్నాయన్న విమర్శలు దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఉత్పన్నం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు చెం దిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కం డువా కప్పుకున్నారు. వీరిలో పటాన్చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మినహా మిగతా తొమ్మిది ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాకపోయినప్పటికీ అనధికారికంగా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జీవన్రెడ్డికి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన డా క్టర్ సంజయ్కుమార్ వర్గాలకు మధ్య గొడవలు
తారస్థాయికి చేరుకోవడంతో జీవన్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ అంశం అధిష్టాన పెద్దల దాకా వెళ్లింది. జీవన్రెడ్డి పార్టీని వదలకుండా అధిష్టానం చివరిదాకా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. అలాగే మంత్రి కొండా సురేఖకు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వర్గాల మధ్య కూడా ఇలాగే పాత, కొత్తా వివాదం చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందే రేవూరి ప్రకాశ్రెడ్డి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ టికెట్పైనే గెలిచినప్పటికీ పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి, రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు పార్టీలోకి వచ్చిన వారికి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ అంశం కూడా అధిష్టానం దాకా వెళ్లింది. తాజాగా మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి (బీఆర్ఎస్) మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాంయికి చేరుకున్నాయి. కడియం శ్రీహరికి దమ్ము ఉంటే తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలిచి చూపెట్టాలని మంత్రి కొండా సురేఖ సవాల్ కూడా విసిరింది.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సురేఖ, శ్రీహరికి మధ్య తలెత్తిన వివాదం పై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏఐసీసీ కార్యదర్శి సచిత్ సావంత్ నేతృత్వంలో టీపీసీసీ ఒక కమిటిని కూడా నియమించింది. దీంతో కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేగానే పరిగణిస్తోన్నట్టు తేలిపోయింది. అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తన అనుచరులకు మాత్రమే పార్టీ మండల అధ్యక్షులుగా నియమించి, పార్టీలో మొదటి నుంచి ఉన్న పాతవారికి అన్యాయం చేశారన్న ఆరోపణలతో భౌతిక దాడులకు దిగిన విషయం తెలిసిందే.ఇతర పార్టీ ల నుంచి కాంగ్రెస్తో జతకట్టిన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీలో కొత్తా, పాత గా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. నామినేటెడ్ పదవుల నియామకంలో పాత వారిని పక్కన పెట్టి కొత్తవారికి (ఎమ్మెల్యేతో పాటు పార్టీలోకి వచ్చిన) వారికి మాత్రమే పదవులు దక్కుతున్నాయన్న అసంతృప్తి పార్టీలో చాపకింద నీరులా పెరుగుతూ వస్తోంది.
ఒక్క నామినేటెడ్ పదవులు మాత్రమే కాకుండా గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలోనూ పాతవారికి కాకుండా పార్టీలోకి వచ్చిన కొత్తవారికి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోకి వచ్చిన నాయకులకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయన్న ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ పెద్దలు పాత, కొత ఎవరినీ వదులుకోకుండా మధ్యేమార్గంగా ఇరువర్గాలను సంతృప్తి పరిచే ఫార్మూలను కనుగొంది. ఢిల్లీలో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన రాష్ట్ర పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఇక ముందు పార్టీలో కొత్తా, పాత విభేదాలకు తావు లేకుండా నామినేటెడ్ పదవులలో పాతవారికి 60 శాతం, కొత్తవారికి 40 శాతం పదవులు దక్కే విధంగా కసరత్తు చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారమే నామినేటెడ్ పదవులకు కసరత్తు చేసి టీపీసీసీకి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా డీసీసీ అధ్యక్షులను ఆదేశించింది.
గతంలో నామినేటెడ్ పోస్టులకు ఏకపక్షంగా ఎంపిక జరిగిందని, ఈ అంశంలో ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే మంత్రులు తన వర్గానికి చెందిన వారికే పదవులు ఇప్పించారనే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ వివాదాలాకు కూడా తావు లేకుండా ఉమ్మడి జిల్లాల ఇంచార్జీ మంత్రుల నేతృత్వంలో జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ,సీనియర్ నాయకులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో నామినేటెడ్ పదవుల ఆశావహుల పేర్లతో ప్రతిపాదనలతో పీసీసీకి అందజేయాలని ఆదేశించింది. ఈ ప్రతిపాదనలపై చివరగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సంయుక్తంగా పరిశీలించి ఖరారు చేసి అధిష్టానం నుంచి ఆమోదం పొందాలని దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారిగా సమన్వయ కమిటీలు సోమవారం నుంచి కసరత్తు చేయనున్నాయి.











