లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. టీం ఇండియా మ్యాచ్ ఓడినప్పటికీ.. రోహిత్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో లార్డ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు. అయితే రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై వస్తున్న వార్తలపై కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. ఇప్పటివరకు జట్టులో అలాంటి చర్చే జరగలేదని గిల్ అన్నాడు.

‘‘ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాతో అనలేదు. ఇదంతా సోషల్‌మీడియాలో మొదలైన చర్చే. గత కొన్నేళ్లుగా రోహిత్ - విరాట్ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు సేవలు అందించారు. ఈ మ్యాచ్‌లోనూ చక్కని భాగస్వామ్యం నిర్మించారు. ఇక రోహిత్ భాయ్ బ్యాటింగ్ అదిరిపోయింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మందకొడిగా మారింది. ఇక్కడ పరుగులు చేయడం చాలా కష్టం. కానీ, అతడి ఆట మాత్రం అద్భుతంగా ఉంది’’ అని గిల్ వివరించాడు.