టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని వరప్రసాద్(చిట్టి బాబు) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వెైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.