
హైదరాబాద్: బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో కిలో బంగారం మాయమైంది. 1028.59 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్లో భద్రపరిచిన ఆభరణాలు మాయమయ్యాయి. వాష్రూమ్ కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని గురుకృప ఎక్స్పోర్ట్స్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











