హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం బొల్లారంలోని ఆర్మీ మద్రాస్ యూనిట్ లో ఆయుధాలను అపహరించారు. తోటి అధికారికి సెలవు ఇవ్వకపోవడంతో ఆయుధాలు ఎత్తుకెళ్లినట్టు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ సంబంధించిన ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్మీ, సివిల్ రహదారుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. బొల్లారంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లను ఆర్మీ అధికారులు మూసివేశారు. మిలిటరీ సైనిక విభాగానికి చెందిన బెల్ ఆఫ్ ఆర్మీ విభాగంలో నాలుగు ఏకే 47 తుపాకులు కనపడకుండాపోయినట్టు అధికారులు తెలిపారు. మిలిటరీ బ్రిగేడియర్ బొల్లారం పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.