
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్హామ్ క్యాబినెట్లో భారత మూలాలున్న ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. బ్రిటిష్ ఇండియన్ కనిష్క నారాయణ్ యూకే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బిహార్లో జన్మించిన 36 ఏళ్ల కనిష్క నారాయణ్ 2024 జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేల్స్ నుంచి ఎంపీగా గెలిచారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఆన్లైన్ భద్రత, కృత్రిమ మేథ విభాగాన్ని ఆయన పర్యవేక్షించేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏఐ మంత్రిగా నియమితులయ్యారు. కాగా, భారత మూలాలున్న లీసా నాండీకి సైతం బర్న్ హామ్ క్యాబినెట్లో చోటు దక్కింది. కీర్ స్మార్టర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లీసా నాండీకి మరోసారి ఆ పదవి దక్కింది.











