నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత్లో గ్యాస్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం అమాంతం పెంచేసింది. ఒక్కో వాణిజ్య సిలిండర్పై రూ.993 పెంచింది. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.3,071కి చేరింది. గృహవినియోగ సిలిండర్ (ఎల్పీజీ) ధరలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం పేర్కొంది.
The post భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర appeared first on Navatelangana.












