హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. అత్తపై కోడలి కత్తితో దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యెరుకల బస్తీలో నివాసముంటున్న 65 ఏళ్ల పద్మావతిపై ఆమె కోడలు విజయలక్ష్మి కత్తితో దాడి చేసింది. కేకలు వినపడడంతో స్థానికులు వెంటనే రక్తపు మడుగులోే ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.