
అమరావతి: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ అంటూ వైసిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఎన్ ఎఫ్ డిబి ప్రాంతీయ కార్యాలయం అవసరం అని అన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని, మెరుగైన సేవల కోసమే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. దీపం-2.0 లబ్ధిదారులకు నిర్ధారిత తేదీల్లో నగదు జమ అవుతుందని, పాస్ పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత అధికారులదేనని చంద్రబాబు సూచించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల లాభాలను ప్రజలకు వివరించాలని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చంద్రబాబు పేర్కొన్నారు.











