అమరావతి: ఎపి విద్యాశాఖ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. జనరల్ గా స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండాలి, కానీ ఎపి మంత్రి లోకేష్ 3 శాతానికి పెంచారని స్పోర్ట్స్ కోటా వాళ్లు ఎగ్జామ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని జివో మార్చి ఇచ్చారని మండిపడ్డారు. జివోలు రద్దు చేయడం, మళ్లీ పాత జివోను పునరుదరుద్దరించడంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డిఎస్ సి ఎగ్జామ్ నిర్వాహణలో పాల్గొన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చిందని మరి ఆయనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అంబటి ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయితే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అంబటి రాంబాబు చురకలంటించారు.