నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ర్యాలీ చేపట్టేందుకు వెళుతున్న రైతులను పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. దేశ్ బచావో మోర్చా (డిబిఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులను హర్యానా -పంజాబ్ సరిహద్దులైన శంభు-అంబాలా, ఖనౌరి-జింద్ వద్ద పోలీసులు మంగళవారం నిలిపివేశారు. శంభు-అంబాలా రహదారిపై హర్యానా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రం భారీగా భద్రతా దళాలను మోహరించింది. రైతులు శాంతియుతంగా ఢిల్లీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్నారని, బిజెపి నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం బారికేడ్లతో […]
The post ఢిల్లీకి రాకుండా రైతులను అడ్డుకున్న పోలీసులు appeared first on Navatelangana.












