దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లోని కలప గోదాములో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సేవా బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 25 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి.. కలప గోదాములో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందనేది అధికారులు వివరాలు వెల్లడించలేదు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.